ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న పెళ్లిళ్లు చాలా వరకు నిలవడం లేదని విషయం ఈ మధ్య చాలా సందర్భాల్లో నిరూపితమైన సంఘటన చూసే ఉంటారు. అయితే బెంగుళూరులోని ప్రముఖ గాయని కూడా వివాహం చేసుకుంది. అయితే అతను వరకట్న వేధింపులు గురిచేస్తున్నాడని ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. వరకట్న సమస్య అనే మాట వినపడుతుంది. అసలు వివరాలు ఏంటో తెలుసుకోవాలి. 

 


వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్‌ను పంపించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డెత్ నోట్‌ను కూడా రాశారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవడానికి అల్లుడు, అతని తల్లిదండ్రులే కారణమని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా ఈ విషయం పై పోలీసులకు పిర్యాదు కూడా చేశారు. 

 


వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కన్నడ గాయని సుష్మిత పేరు అతి కొద్దీ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. సినిమాలల్లో ను, టీవీ సీరియల్లోను, స్టేజ్ షో లలో పాడి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది.సుస్మితకు ఏడాదిన్నర కిందట ఆమె వివాహమైంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న శరత్ అనే యువకుడిని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వివాహమైన తొలి రోజుల నుంచే అత్తింటి వేధింపులను ఎదుర్కొన్నారు. అదనపు కట్నం కోసం శరత్, అతని తల్లిదండ్రులు సుస్మితను వేధించే వారని మృతురాలి తరఫు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు

 


తల్లికి వాట్సప్ ద్వారా మెసేజీని పంపించారు. తన భర్త శరత్‌, అతని తరఫు బంధువులను ఎవ్వర్నీ వదలొద్దని ఇందులో పేర్కొన్నారు. అత్తవారింట్లో ఆత్మహత్య చేసుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, తాను పుట్టి, పెరిగిన ఇంట్లోనే ప్రాణం వదలాలని నిర్ణయించుకున్నట్లు సుస్మిత.. డెత్‌నోట్‌లో పేర్కొన్నారు. తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: