బీజేపీ కీలక నేత కేంద్రమంత్రి అయిన స్మృతి ఇరానీ రాజకీయాల్లో.. తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. అటు పార్లమెంట్ లో కూడా.. పార్లమెంట్ మొత్తం దద్దరిల్లిపోయేల  ప్రసంగాలు ఇస్తూ ఉంటారు స్మృతి ఇరానీ . కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇచ్చే ప్రసంగాలన్ని ఎంతగానో ఆకట్టుకునేలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ప్రతి విషయం పై గొంతు వినిపిస్తు ఉంటారు స్మృతి ఇరానీ . ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వృత్తి పరంగా ఎంతో హుందాగా ఉంటారు. సాధారణంగా ఆమె కట్టు బొట్టు భారతీయత ఉట్టిపడే రీతిలో ఉంటాయి. 

 

 భారత సాంప్రదాయమైన చీరను ధరించి... నుదుటన  పెద్ద బొట్టు పెట్టి... సాంప్రదాయానికి నిలువుటద్దంల ఉంటారు స్మృతి  ఇరానీ. ఆమెను ఎప్పుడు పార్లమెంటులో చూసినా భారతీయత ఉట్టిపడే ఉంటారు.  పార్లమెంటులో ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటారు. అయితే పార్లమెంటులో ఎన్నో విషయాల పై తనదైన వాదనలు వినిపిస్తూ ఉండే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... సామాజిక మాధ్యమాల్లో కూడా ఎంతో ఆక్టివ్ గా ఉంటారు. కాగా ప్రస్తుతం స్మృతి  ఇరానీ  రెండవసారి కేంద్రమంత్రిగా పని చేస్తున్నారు. 


 ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కేంద్రమంత్రుల్లో ఒకరైన స్మృతి  ఇరానీ కి  లక్షల్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఓవైపు హుందాగా  ఉంటూనే... తన చేతల్లో జోష్ ని  ప్రదర్శిస్తూ ఉంటారు స్మృతి ఇరానీ, అయితే మామూలుగా భారతీయత ఉట్టిపడే కట్టుబొట్టుతో ఉండే స్మృతి ఇరానీ... తాజాగా  సరికొత్త హెయిర్ స్టైల్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు, దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది, స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన ఫోటోలు ఆమె కట్టు బొట్టు ఎక్కడా కనిపించలేదు. ఈ రోజే హెయిర్ కట్ చేయించుకున్నాను రేపు మళ్ళీ మామూలుగా ముడి వేసుకుంటాను అంటూ ఆమె ఫోటోలను షేర్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: