దేశవ్యాప్తంగా అందులోనూ మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వరుసపెట్టి జరుగుతున్న ఐటీ దాడులు ఎంత కలకలం రేపాయో మనందరికీ తెలిసిందే. రాజకీయవేత్తలు, సినిమా వారు మరియు వ్యాపారవేత్తలు అని తేడా లేకుండా ఆర్థిక శాఖ అధికారులు వరుస పెట్టి అందరిపై ఐటీ దాడులు జరిపారు. అయితే అన్నింటిలోకి చంద్రబాబునాయుడు యొక్క పర్సనల్ సెక్రెటరీ అయిన శ్రీనివాస్ దగ్గర భారీ మొత్తంలో రెండు వేల కోట్ల రూపాయల వరకూ ఇన్కమ్ టాక్స్ అధికారులు జప్తు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

 

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొదటి నుంచి ఐటీ అధికారుల కన్ను టిడిపి నాయకుల మీద మరియు టిడిపి నాయకులు కి అత్యంత సన్నిహితంగా ఉన్న వారి మీద పడింది. ఇదే క్రమంలో శ్రీనివాసరావు ఇంటిపై దాడిచేయగా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లు మరియు నగదును ఇన్కమ్ టాక్స్ అధికారులు జప్తు చేయగా వైసిపి నేత మరియు ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో బాబు గారి భాగోతం ఇది అంటూ చంద్రబాబుని ఉద్దేశించి పలు ట్వీట్లు వేశారు.

 

అయితే ప్రతి చోటా తెలుగుదేశం పార్టీ మీడియా పేజీలు దొరికింది కేవలం రెండు లక్షల రూపాయలు అని రెండు వేల కోట్ల రూపాయలు దొరికాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీనితో విజయసాయిరెడ్డి ఖచ్చితమైన ఆధారాలుగా ఐటీ అధికారులు జప్తు చేసిన డాక్యుమెంట్లు వివరాలను నమోదు చేసిన పేపర్ ను చూపించి ఇందులో దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకూ ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఉందని మరియు అందులో ప్రతి ఒక్క రూపాయికి చంద్రబాబునాయుడు జవాబుదారి అని నిక్కచ్చిగా చెప్పేశారు. ఇప్పుడు బండారం అంతా బయటకు వస్తే బాబు కచ్చితంగా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: