అయ్య బాబోయ్..! జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో ఎన్ని దారుణాలు చేశాడు తెలుసా..?  భారీగా రేషన్ కార్డులు ఏరేశాడు. పింఛన్లు లో కోత పెట్టేసాడు. అంతేనా ..?  సుమారు లక్ష కోట్ల విలువైన సంక్షేమ పథకాలను తీసి అవతల పడేసాడు. అది ఎంతగా అంటే ఆయనకి అధికారం వచ్చిన ఈ తొమ్మిది నెలల్లోనే 18 .72 లక్షల రేషన్ కార్డులు.. ఏడు లక్షల మంది ఫెన్షన్ లు పీకి అవతల పడేసాడు. ఇంతకన్నా దారుణం ఉంటుందా ..? అడిగేవాడు లేదు అనుకుంటున్నారా ఏంటి ...?  ఎంతకాలం ఈ దారుణం..? జగన్ తీసినవన్నీ అర్హతలేని వాళ్లు.. బోగస్ లబ్ధిదారులు అయినా మాకు అనవసరం దీనిపై  ఎవరు చూస్తూ ఊరుకున్నా తాము మాత్రం చూస్తూ ఊరుకోం అంటూ ఏపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి అడిగినవారికి అడగని వారికి అరిచి మరీ చెప్పుకుంటూ గోల పెట్టేస్తోంది.


 అసలు తాము తప్ప ఏపీలో ఎవరు పరిపాలన చేయలేరని... చేయబోరని.., మాకు మేమే సాటి... మాకు ఎవరూ లేరు పోటీ అంటూ చెప్పుకుంటుంది. వైసీపీ ప్రభుత్వం పై అందుబాటులో ఉంటే మీడియా... లేకపోతే సోషల్ మీడియా ఇలా దాన్ని.. దీన్నీ వదలకుండా ఇష్టం వచ్చినట్లుగా వాడేసుకుంటోంది. అర్జెంటుగా ప్రజల్లో జగన్ దుర్మార్గుడు... సైకిల్ పార్టీ పాలన బాగుంది అని అనిపించుకోవాలని టిడిపి నాయకులు, ఆ పార్టీ అధినేత ఆ పార్టీకి కాబోయే బుల్లి నేత, ఇలా అందరూ ఆరాటపడిపోతుంటారు. అంతటితో ఆగిపోయారా అంటే అబ్బే ఆగలేదు. మా సైకిల్ కు బ్రేకుల్లేవు అన్నట్లుగా ఇప్పుడు ఢిల్లీకి చినబాబు తో రాయబారం పంపి ఫిర్యాదు చేసి జగన్ కు ఆఘమేఘాల మీద చివాట్లు పెట్టించాలని చూస్తున్నారు.


ఈ రోజు ఢిల్లీలో వాలిపోతున్నారు చినబాబు అండ్ పేద బాబు భజన బృందం. అయితే అక్కడ ఢిల్లీ పాలకులు మాత్రం ఈ బృందానికి సో.. సారీ బాబు !  ఖాళీ లేదు పైకి వెళ్ళి రండి అంటూ కబురు పంపేశారు. అయినా ఢిల్లీ కి వెళ్లి ఏదో చేసేశామని చెప్పుకోవాలి కాబట్టి తమ బాధను కనీసం ఎంకయ్య కైనా చెప్పుకుందాం అన్నట్టుగా ఢిల్లీకి వెళుతోంది. అక్కడ అ ఏమి జరగకపోయినా భజన మీడియా లో ఏదో ప్రళయం జరిగిపోయింది... కేంద్రం జగన్ పై కత్తులు, తుఫాకులు గురిపెట్టేస్తుంది అని చెప్పుకునేందుకు సినబాబు అండ్ కో బృందం హడావుడిగా సిద్ధమైపోయింది.


ఈ ఏడుపులు.. పెడబొబ్బలు ఎప్పుడూ ఉండేవే గా అన్నట్టుగా జనాలు వీరి ఆర్తనాదాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అనుమానంగా చేస్తుండడంతో ఈ సైకిల్ పార్టీ అధినేతకు ఎక్కడ లేని కోపం పెరిగి పోతున్నాయి. వీలైతే బెదిరింపు లేకపోతే కాళ్ల బేరం కాన్సెప్ట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది కాబట్టి శరణు శరణు అంటూ బీజేపీని వేడుకునేందుకు   ఈరోజు సినబాబు బృందం ప్రయత్నాలు చేస్తుందట. అదేంటి ఇప్పటి వరకు ఇలాంటి వ్యవహారాలు బాబోరు చేసేవారు కదా అంటారా ..? అవునవును. అంటే మొన్న ఆయన పీఎస్ గారి ఇంట్లో ఐటీ దాడులు జరిగినప్పటి నుంచి బయటకు వచ్చేందుకు ఆయనకు మొఖం చెల్లట్లేదు కదా..!


అందుకే ఇప్పుడు తన మాటను వారి మాటగా చెప్పాల్సిందిగా సినబాబు ని ఢిల్లీ కి తోలుతున్నారు. అసలే నోట్లో నాలుక లేని చినబాబు ఢిల్లీలో చూసి వస్తాడో.. లేక కాల్చి వస్తాడో అనే భయం బాబు లోనూ ...తెలుగు తమ్ముళ్ళలోనూ అప్పుడే మొదలైపోయింది. పండిత పుత్రా ... జాగ్రత్త నాయనా !

మరింత సమాచారం తెలుసుకోండి: