తెలుగు రాష్ట్రాల్లో ఈ మద్య మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోతున్నాయి.   ఉచ్ఛ నీచాలు మరిచి చిన్న పిల్లలు, ముదుసలి అన్న తేడా కూడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.  ఓవైపు ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకుంటున్నాం అంటూ ఉన్న మరో వైపు అత్యాచారాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయ.  ఇటీవల తెలంగాణ లో దశ అత్యాచార, హత్య కేసులు నలుగురు నింధితుల ఎన్ కౌంటర్ అయిన్పప్పటికీ కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.  తాజాగా గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

 

మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కామాంధుల నుంచి ఆమె తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం మాత్రం శూన్యమే అయ్యింది.  అయితే తనను అత్యాచారం చేసి చంపే ప్రమాదం ఉందని భయపడిన ఆమె  అలాగే  నగ్నంగా రెండు వందల మీటర్ల దూరం పరిగెత్తినట్టు సమాచారం. మహిళను వెంటాడి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ మహిళను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం పంపించారు.  ఇప్పటికే ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని.. చంపేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. 

 

ఇక అక్కడి కొంత మంది నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. సమాజంలో ప్రతిచోట ఇలాంటి కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారని.. అలాంటి వారిని పోలీసులు కఠినంగా పది మంది ముందే శిక్షించాలని అంటున్నారు.  ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా ప్రతిచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. కానీ ఎక్కడ కూడా ఇలాంటి కామాంధులకు  భయపడి మరోసారి చేయలన్న ఆలోచన వచ్చే విధంగా కఠినమైన శిక్షలు అమలు కాకపోవడమే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: