ఇప్పుడు తల్లితండ్రులు చుసిన పెళ్లిళ్ల కంటే పిల్లలు ప్రేమించుకొని చేసుకొనే పెళ్లిళ్లే ఎక్కువ అయిపోయాయి. అలాంటి ఈ సమయంలో ఇంకా పెద్దలు ఏ 1940లోనో లా పిల్లల ప్రేమలు అంగీకరించకపోతే.. పెద్దల మాట విని పెళ్లిళ్లు చేసుకోరు... ఇల్లు వదిలి పారిపోతారు.. లేదు అంటే ఆత్మహత్యలు అయినా చేసుకుంటారు. ఇది ఈ కాలం ట్రెండ్. 

              

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ ప్రేమ జంట ప్రేమికుల రోజు ఆత్మహత్య చేసుకుని మరణించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హణసూరు సమీపంలోని కోట్టిగాళ ప్రాంతానికి చెందిన సచిన్ అనే యువకుడు, యామగుంబ గ్రామానికి చెందిన సింధు అనే యువతి గత రెండు సంవత్సరాలగా ప్రేమించుకుంటున్నారు.            

 

అయితే సచిన్, సింధుల కులాలు వేరు అవ్వడంతో తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. కులాంతర వివాహాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు అని అమ్మాయి సింధుకు సంబంధం చూశారు. ఆ యువతీ ఎంత వద్దు అని చెప్పిన సరే వినకుండా ఆ యువకుడితో నిశ్చితార్థం చేశారు. అయితే ఎం చెయ్యాలి అని యువతీ యువకుడు ఆలోచించగా తను లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఆ యువకుడు చెప్పాడు.           

 

ఇక ఆ యువతీ కూడా నిన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోలేను అని చెప్పి.. ఇద్దరం కలిసి బతకలేం.. కలిసి చనిపోదాం అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నట్టే వారు ప్రేమికుల రోజు బయటకు వచ్చి మరణించారు. ఇంకా సరిగ్గా రెండు రోజుల్లో పెళ్లి ఉండగా ఆ యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: