ఆంధ్ర ప్రదేశ్ నీటి డైరెక్టర్ చిలకలపల్లి సూర్యప్రకాశ్రావు విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు, వార్తలు ఏపీ రాజకీయ... విద్యా వర్గాల్లోనూ సంచలనంగా మారాయి. సూర్య ప్రకాష్ రావు పట్టాలు ఇవ్వాలి అంటే అబ్బాయిలను డబ్బులు ఇవ్వాలంటూ.. అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ విషయం ఇప్పుడు మీడియాలో... సోషల్ మీడియాలో ప్రముఖంగా రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇక సూర్యప్రకాష్ రావుపై పైడికొండల తీవ్రంగా మండి పడుతున్నారు. ఆయన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రితో పాటు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. సూర్యప్రకాష్ రావుపై త్వరలోనే చర్యలు ఉంటాయని కూడా మాణిక్యాలరావు చెపుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నిట్కు డైరెక్టర్గా అప్పటి వరకు వరంగల్ నిట్లో పని చేస్తోన్న సూర్యప్రకాష్ రావును పదోన్నతిపై తీసుకువచ్చారు.
పీహెచ్డీ సర్టిఫికెట్ కావాలంటే అబ్బాయిలు రు. 5 లక్షలు ఇవ్వాలని.. అమ్మాయిలు అయితే తన కోరికలు తీర్చాలని ఓ యూట్యూబ్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. వీటిలో తాను ఉమనైజర్ను.. ఛాన్స్ వస్తే ఏ అమ్మాయిని అయినా వాడేస్తా అంటూ ఆయన మాట్లాడిన వార్తలు ఉన్నట్టు మాణిక్యాలరావు చెపుతున్నారు. యూ ట్యూబ్లో ఆ వీడియోలను బేస్ చేసుకునే తాము కంప్లైంట్ చేశామని మాణిక్యాలరావు చెపుతున్నారు.
మరోవైపు దీనిపై బీజేపీ యువ మోర్చా, బీజేపీ మహిళా మోర్చా నేతలు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఏపీ నిట్ డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు తోసిపుచ్చుతున్నారు. తానేంటో తన విద్యార్థులకు తెలుసు అని.. పార్లమెంటులో నిట్ డైరెక్టర్ వరంగల్ నిట్ ప్రోఫెసర్గా పనిచేస్తోన్న తాను అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ విభాగానికి హెడ్గా ఉన్నానని చెపుతున్నారు. తనకు 30 అవార్డులు కూడా వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ వివాదం ఎటు మలుపులు తిరుగుతుందో ? చూడాలి.