ఈ మధ్య కాలంలో చిన్నచిన్న గొడవల కారణంగా భార్య భర్తను, భర్త భార్యను చంపుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సినిమాలు, న్యూస్ ఛానెళ్ల ప్రభావంతో కొందరు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఒక మహిళ తన భర్తను చంపడానికి భోజనంలో సైనేడ్ కలిపింది. కానీ భార్య భోజనంలో సైనేడ్ కలిపిందనే నిజం తెలియడంతో భర్త భోజనం తినకుండా ప్రాణాలను రక్షించుకున్నాడు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమిడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో గురునాథ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశించేవాడు. గత కొంతకాలంగా గురునాథ్, అతని భార్య మధ్య తరచుగా చిన్నచిన్న గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురునాథ్ భార్య భర్తను చంపాలని కుమారునితో కలిసి ప్లాన్ చేసింది. భర్త తినే భోజనంలో సైనేడ్ కలిపి ఆ భోజనం తినమని భర్తకు చెప్పింది. 
 
కానీ భార్య సైనేడ్ కలిపిందని గ్రహించిన భర్త ఆఖరి క్షణంలో భోజనం తినకుండా తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఆ తరువాత సమీపంలోని పోలీస్ స్టేషన్ లో భార్యపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. గురునాథ్ భార్య, కొడుకుతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురునాథ్ ను అతని భార్య ఎందుకు చంపాలనుకుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులకు సైనేడ్ ఎక్కడినుండి వచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది.గురునాథ్ భార్య భోజనంలో సైనేడ్ కలపడం వెనుక బలమైన కారణమే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: