చంద్రబాబునాయుడుకు కడుపుమంటగా ఉందా ? ఏమో జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కాబట్టి నిజమని నమ్మాల్సిందే.  ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు లాంటి వారు ఉంటారని ఎద్దేవా చేశారు. కర్నూలు కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  చంద్రబాబు లాంటి వాళ్ళకు కడుపుమంట బాగా ఎక్కువగా ఉంటుందన్నారు. క్యాన్సర్ చికిత్సకు మందు ఉంటుంది కానీ అసూయతో వచ్చే కడుపుమంటకు మాత్రం చికిత్స ఎక్కడా దొరకదన్నారు. అలాగే చెడు దృష్టికి కూడా చికిత్స లేదని జగన్ పేల్చిన పంచ్ వైరల్ గా మారుతోంది.

 

సరే జగన్ ఏ ఉద్దశ్యంతో అన్నాడో కానీ చంద్రబాబు చేష్టలు, మాటలు కూడా అలాగే ఉన్నాయి.  ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలన్నా ముందుగా అడ్డు పడిపోతున్నారు చంద్రబాబు అండ్ కో. జగన్ చేసిన ప్రకటించిన ప్రతి పథకం విషయంలోనూ తప్పులే వెతుకుతు, లోపాలను మాత్రమే చూస్తున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. చంద్రబాబు ఉద్దేశ్యంలో ప్రతిపక్షమంటే అధికారపార్టీ చేపట్టే ప్రతి పనిని వ్యతిరేకిచంటమే అన్నట్లుగా తయారైంది.

 

పాదయాత్ర  సందర్భంగా నవరత్నాలను ప్రకటించారు జగన్. దానిపై టిడిపి నానా రాద్దాంతం చేసింది. నవరత్నాలు కాదు నవగ్రహాలంటూ ఎంతగా అవహేళన చేసింది అందరూ చూసిందే.  నిజానికి తాను ప్రకటించిన పథకాలు అమలు చేయాలంటే ముందు ఖజానా నిండా డబ్బుండాలన్న విషయం తెలిసిందే. కానీ జగన్ అధికారంలోకి వచ్చేనాటికి ఖజానా పరిస్ధితేంటి ?  పార్టీ వర్గాలు చెప్పిన ప్రకారం ఖజానాలో ఉన్నదే రూ. 100 కోట్లట.

 

అంటే అధికారంలో ఉన్నంత కాలం ఖజానాను పూర్తిగా నాకేశారు. పైగా అందినకాడికి ఎక్కడబడితే అక్కడల్లా అప్పులు చేసేశారు. చివరకు అప్పులకు వడ్డీలు కూడా కట్టలేదు. దాంతో అధికారంలోకి రాగానే వడ్డీల భారం, అప్పుల భారం జగన్ పై పడింది. వాటిని తీర్చటానికే నానా అవస్తలు పడుతుంటే చంద్రబాబు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు ఎంతగా హేళన చేశారో చూసిందే. ఇందుకే బహిరంగసభలో చంద్రబాబును ఉద్దేశించి జగన్ కడుపుమంట అని అన్నది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: