స‌మాజంలో రోజు రోజుకు అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటూ భ‌ర్త‌ల‌ను మోసం చేస్తోన్న‌... బెదిరిస్తోన్న కిలేడీలు ఎక్కువ అవుతున్నారు. ఏపీ, తెలంగాణ‌లోనూ ఇలాంటి కిలేడీల‌ను లెక్కకు మిక్కిలిగా చూస్తున్నాం. ఇప్పుడు గుంటూరులోనూ ఇలాంటి కిలేడీ బాగోతం ఒక‌టి బ‌య‌ట ప‌డింది. ఓ విలేక‌రితో ఎఫైర్ పెట్టుకుని చివ‌ర‌కు భ‌ర్త నిల‌దీయ‌డంతో ఇప్పుడు ఏకంగా విడాకులు కావాల‌ని భ‌ర్త‌ను బెదిరించ‌డంతో పాటు తాను ప్రియుడితోనే ఉంటాన‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

 

భార్య ప్ర‌వ‌ర్త‌న‌తో షాక్ అయ్యి పది రోజుల్లో విడాకులు ఇవ్వకపోతే భార్య చంపేస్తానని బెదిరిస్తోదంటూ ఓ అమాయక భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది.  నరసరావుపేట మండలంలో వడ్రంగి పనిచేస్తూ జీవించే వ్యక్తికి 16ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. అప్ప‌టికే వీరిద్ద‌రికి పెళ్లి అయ్యి వాళ్ల నుంచి విడాకులు తీసుకున్నారు. వీళ్లిద్ద‌రికి ఇది రెండో వివాహం.

 

ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం కూడా ఉన్నారు. ఓ కేసు నిమిత్త‌మైన పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లిన వీరికి ఓ విలేక‌రి ప‌రిచ‌యం అయ్యాడు. అప్ప‌టి నుంచి ఆ విలేక‌రి ఆ స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని.. తాను సాయం చేస్తానంటూ ఈ దంప‌తుల‌తో ప‌రిచ‌యం పెంచుకుని ఆ భార్య‌కు ద‌గ్గ‌రై.. ఆమెతో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఆ భ‌ర్త‌ ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు స్థానికులు చెప్పారు. దీంతో భార్యను నిలదీయగా ప్రియుడితోనే ఉంటానని, విడాకులు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేసింది. 

 

అక్క‌డితే ఆగ‌ని ఆ భార్య కేవ‌లం ప‌ది రోజుల్లో విడాకులు ఇవ్వ‌క‌పోతే చంపేస్తాన‌ని బెదిరిస్తోందంటూ రూర‌ల్ ఎస్సీకి ఫిర్యాదు చేయ‌డంతో ఇప్పుడు ఈ ఫిర్యాదు జిల్లాలోనే సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రూర‌ల్ ఎస్సీ దీనిని ప్ర‌త్యేకంగా విచారిస్తున్నారు. మ‌రి కేసులో ఏం తేలుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: