ఆమె ప‌విత్ర‌మైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఎంతో మంది భావి భార‌త పౌరుల‌ను త‌యారు చేయాల్సిన ప‌విత్ర‌మైన వృత్తిలో ఉండి స‌మాజంలో నీచమైన ప‌ని చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు తో అక్రమ సంబంధం పెట్టుకుని తన కామ కోరికలు తీర్చుకున్న ఆ ఉపాధ్యాయురాలు తన భర్త త‌న అక్ర‌మ సంబంధాల‌కు అడ్డు వ‌స్తుండ‌డంతో అతడిని మూడుసార్లు హత్య చేయించేందుకు ప్రయత్నించింది.  ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఆమె పలువురి తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీనిని భర్త ప్రశ్నించడంతో... చివరకు భర్తనే తన ప్రియుళ్ల సహకారంతో హత్య చేసేందుకు ప్లాన్ వేసి అడ్డంగా బుక్కయింది.

 

తమిళనాడులోని ధర్మపురి జిల్లా కారిమంగళం సమీపంలోని మట్టలూరు గ్రామానికి చెందిన పొన్నువేల్ (46) భూస్వామి. పొన్నువేల్ వ్యవసాయం చేయిస్తున్నాడు. పొన్నువేల్ భార్య ప్రియ (41) కారిమంగళం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్నది. పొన్నువేల్, ప్రియ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. టీచ‌ర్ అయిన ఆమె అనేక మందితో అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంది. త‌న‌తో పాటు ఉద్యోగం చేస్తోన్న‌ సాటి ఉపాధ్యాయులతో ప్రియ అక్రమ సంబంధం పెట్టుకుని వారితో విద్యార్థుల ముందే చాల సన్నిహితంగా ప్రవర్తిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.

 

అలాగే కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌తో కూడా ఆమెకు అక్ర‌మ సంబంధాలు ఉన్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రియ అక్రమ సంబంధం సాగిస్తున్న వారి జాబితాలో శక్తివేల్ (23), అరుణ్ కుమార్ (24) అనే ఇద్దరు యువకులు ఉన్నారు. ఈ విష‌యం ఊరు వాడా తెలియ‌డంతో ఆమెను భ‌ర్త హెచ్చ‌రించాడు. అయితే చివ‌ర‌కు భ‌ర్త‌ను అడ్డు తొల‌గించు కోవాల‌ని డిసైడ్ అయిన ప్రియ ఓ సారి విష ప్ర‌యోగం చేసినా ఆయ‌న బ‌య‌ట ప‌డ్డాడు. మ‌రోసారి మ‌త్తు మందు ఇచ్చి చంపాల‌ని చూసింది. చివ‌ర‌కు త‌న ప్రియుళ్లు అయిన ఇద్ద‌రు యువ‌కుల‌ను రెచ్చ‌గొట్ట‌గా వాళ్లు ఇద్ద‌రు పొన్నువేళ్‌ను కారుతో ఢీ కొట్టి చంపేందుకు ప్ర‌య‌త్నించ‌గా ఆయ‌న గాయాల‌తో బ‌యట ప‌డ‌డంతో పాటు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం పోలీసులు ఈ కేసును తీవ్రంగా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: