కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కేసీఅర్ పై మండిపడ్డారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇస్తున్న సూచనల మేరకే ఆయన మెప్పు కోసం కేసీఆర్ మతపరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీకి తొత్తుగా కేసీఆర్ మారారని పీయూష్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పై కేంద్ర మంత్రి పీయుశ్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసమే ముస్లింలకు కేసీఆర్ 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని టైమ్ స్క్వేర్ హోటల్‌లో కేంద్ర మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.

 

 

కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని అవమానపరుస్తోందని, అసలు దాంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన అన్నారు. పార్లమెంటు చేసిన చట్టాలను, రాష్ట్రాలు వ్యతిరేకించలేవని సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ కూడా గతంలో అన్నారని ఈ విధంగా కేసీఅర్ కి కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

 

 

గతంలో కేటీఆర్ దిల్లీ వచ్చి కేంద్రంతో అన్ని రాష్ట్రాలు కలిసి పని చేయాలని చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా మంత్రి వర్గంలో తీర్మానం చేయడం బాధాకరమని పీయుశ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనూ అమలు చేయాలని కేసీఆర్‌ కు సూచించారు. ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కూతురు కవితను ఓడించటం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సందేశం పంపారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటోందన్నారు. 

 

 

ఆయన 1951లో పాకిస్థాన్‌లో 23 శాతం ఉన్న మైనార్టీలు ఇప్పుడు 3 శాతారని పడిపోయారని తెలిపారు. వీరంతా ఎక్కడికెళ్లారు? అందరూ చచ్చిపోయారా? లేక ఇస్లాం మతం పుచ్చుకున్నారా? లేదా వారు మన దేశంలోకి చొరబడ్డారా? ఇలా అక్కడ మతపరమైన వేధింపులు, హింసకు గురై మన దేశంలోకి వచ్చిన వారందరికీ నీడనిచ్చి పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతోనే మేం ఉన్నాం. అని పీయుశ్ గోయల్ తేల్చి చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: