చెన్నూరుకు చెందిన అరవెల్లి వసంతం అనే వ్యక్తి సోమవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు హాస్పటల్కు తీసుకు వెళ్లారు. డాక్టర్లు వసంతంను బతికించేందుకు ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. వసంతం చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు. దీంతో మృతదేహంతో కుటుంబసభ్యులు కారులో ఇంటికి బయలుదేరారు. తండ్రి మృతి చెందడంతో ఆయన కుమార్తె ప్రియ ఏ మాత్రం జీర్ణించు కోలేకపోయింది.
తండ్రి లేని బతుకు తనకు వద్దనుకుంది. ఈ సమయంలోనే మృతదేహంలో ఇంటికి వెళుతున్న టైంలో కారులో వెళ్తున్న వసంతం కూతురు ఆరవెల్లి సాయి ప్రియ (32) తనకు వాంతి వస్తోందంటూ కిందికి దిగింది. ఆ పక్కనే ఉన్న గోదావరి బ్రిడ్జి వద్ద వాంతి చేసుకుంటున్నట్లుగా నటించి.. దూకేసింది. ఈ పరిణామంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
వెంటనే వాళ్లు తేరుకుని నదిలో పడిన ఆమెను కాపాడేలోపే ప్రాణాలు కోల్పోయింది. తండ్రి మరణాన్ని తట్టుకోలేకే సాయి ప్రియ ఆత్మహత్య చేసుకున్నదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషాద పరిణామంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.