మన భారతీయ సంస్కృతిలో స్త్రీపై అనేక రకాలుగా వివక్ష ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మహిళలు కాస్త ఆ వివక్ష నుంచి బయటకు వస్తున్నారు. గతంలో నెలసరి రోజుల్లో మహిళలను ఓ మూలన కూర్చోబెట్టేవారు. ఆ మూడు రోజులూ ఆమె ఇంట్లోకి కూడా వచ్చేది కాదు. కానీ రోజులు మారిపోయాయి.

 

 

కానీ.. నెల సరి రోజుల్లో ఆడది వంట చేయకూడదట. అలా వంట చేస్తే ఆమె వచ్చే జన్మలో వ్యభిచారిగా పుడుతుందట. అంతే కాదు.. నెలసరి రోజుల్లో ఆడది వండిన వంటి తిన్న మగవాడు వచ్చే జన్మలో ఎద్దుగా పుడతారట. ఇదంతా చెప్పింది ఎవరంటారా.. ఆయన పేరు స్వామి కృష్ణస్వరూప్ దాస్‌జీ. ఈయన గుజరాత్‌లోని స్వామినారాయణ్ భుజ్ మందిర్‌కు చెందిన ఓ పెద్ద స్వామీజీ.

 

 

ఇటీవల ఈ స్వామి కృష్ణస్వరూప్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన ఏమన్నారంటే.. “ మీరు ఏమైనా అనుకోండి. మీకు నచ్చినా నచ్చకపోయినా పవిత్రమైన మన శాస్త్రాల్లో ఉన్నదే నేను చెప్తున్నా. ఆ తర్వాత మీ ఇష్టం. శాస్త్రాల ప్రకారం, పీరియడ్స్‌‌లో ఉన్న మహిళ.. భర్తకు వంట చేసి పెడితే ఆమె వచ్చే జన్మలో వేశ్యగా పుడుతుంది. ఆ వంట తిన్న మగాడు ఎద్దులా పుడతాడు .. అని చెప్పారు.

 

 

అంతే కాదు.. ఆయన ఇంకా ఏమన్నారంటే..” ‘ఈ రహస్యాల గురించి భక్తులకు చెప్పకూడదని ఎందరో మహర్షులు నాకు చెప్పారు. కానీ నేను చెప్పకపోతే మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. అందుకే చెప్తున్నానని వివరించారు. భర్తలంతా పెళ్లికి ముందే కొద్దోగొప్పో వంట నేర్చుకోవాలని, అప్పుడు పీరియడ్స్‌లో ఉండగా భార్య చేతివంట తినకుండా స్వయంగా వండుకోవచ్చని సలహా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: