ఛీఛీ.. ఈ మధ్యకాలంలో నీచులు.. మగమృగాళ్లు ఎలా తయారు అయ్యారంటే.. ప్రేమిస్తే.. ఎంత ఎదవ అయినా సరే.. తిరిగి ప్రేమించాల్సిందే.. లేకపోతే యాసిడ్ పోస్తారు.. అది కుదరకపోతే.. అమ్మాయిని తిరిగిరాని లోకాలకు పంపిస్తారు.. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే గజ్వేల్ లో జరిగింది. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె ఒక బ్యాంక్ ఉద్యోగి. వారం రోజుల్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది.. తల్లితండ్రులు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఇంకా అలా పెళ్లి ఏర్పాట్ల సమయంలోనే తల్లితండ్రులు పని మీద బయటకు వెళ్లారు.. ఇంట్లో ఒక్క ఆ అమ్మాయి తప్ప ఎవరు లేరు.. కాబోయే భర్తతో ఫోన్ మాట్లాడుతుంది..

 

ఇంకా అదే సమయం అనుకోని..  ఆ నీచుడు.. దుండగుడు.. ప్రేమోన్మాది ఆమెను దారుణంగా పదునైన కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి గజ్వేల్‌ లో జరిగింది. ప్రేమ పేరుతో ఆ యువకుడు వేధిస్తున్నాడు.. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా అని బెదిరించాడు.. బెదిరించినట్టే ఆ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు అని మృతురాలు తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దివ్య గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకులో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆమెను గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేములవాడకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడు వేధింపులకు గురి చేశాడు అని తల్లి తండ్రులు తెలిపారు.

 

దివ్య హైస్కూల్‌లో చదువుకునే సమయం నుండే ఆ యువకుడు పరిచయం అని... కొన్ని సంవత్సరాలుగా ప్రేమించాలని వేధింపులకు గురి చేశాడని.. పోలీస్ స్టేషన్ లో అతడిపై ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. అలా ఫిర్యాదు చేసిన అనంతరం ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించరని తమ కుమార్తె జోలికి ఇక రానని రాసిచ్చాడని వివరించారు. అయినా ఇప్పుడు వారం రోజుల్లో పెళ్లి ఉందనగా ఈ దారుణానికి పాల్పడ్డాడు అని ఆ తల్లితండ్రులు వాపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: