ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని స్మశానవాటికలో పూడ్చి  వేస్తారు కానీ ఇక్కడ మాత్రం... చనిపోయిన తన ప్రియున్ని  ఏకంగా ఇంట్లోనే పాతిపెట్టి.. రెండు నెలలుగా అతడు సమాధి పక్కనే నిద్రపోతుంది ప్రియురాలు . ఈ ఘటన ఎవరికీ తెలియకుండా ఎంతగానో జాగ్రత్త పడింది. ఇక ఆ యువకుడు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మధ్యప్రదేశ్ లోని కుసమీ  పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... జాను సింగ్ అనే యువతి సాత్నా  జిల్లాకు చెందిన ఇషాన్  మహమ్మద్ అనే యువకుడిని ప్రేమించింది. 

 

 

 వీరిద్దరూ కొంతకాలం పాటు కామాక్ష్  గ్రామానికి వచ్చి సహజీవనం కూడా చేసారు. కొంతకాలం పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట మధ్య తరచూ గొడవలు జరగడం మొదలైంది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానలా కావడంతో... తీవ్ర మనస్తాపం చెందాడు ఇషాన్  మహమ్మద్ అనే యువకుడు. ఈ క్రమంలోనే అదే నెల 7వ తేదీన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక తన ప్రియుడు ఇషాన్  ఉరివేసుకొని చనిపోవడం తో ఏం చేయాలో పాలుపోని ప్రియురాలు జాను సింగ్... ఈ విషయాన్ని అసలు బయటకు పొక్కనివ్వలేదు. ఈ క్రమంలోనే అతడి మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తవ్వి పాతి పెట్టింది. 

 

 

 ఇక అప్పటి నుంచి అతని సమాధి పక్కనే నిద్రించటం  మొదలు పెట్టింది జాను సింగ్. మరోవైపు తన కుమారుడు కొన్ని రోజులపాటు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జాను ఇషాన్  ప్రేమికుల అని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారణ చేపట్టడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో తమ మధ్య గొడవ జరిగిందని... దీంతో అతను ఉరి వేసుకున్నాడు అని... ఇషాన్  ఉరివేసుకున్న సమయంలో తాను ఇంట్లో లేనని.. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టినట్లు జాను తెలిపింది. దీంతో పోలీసులు కూడా షాకవ్వలసిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: