నిజంగా ఈ ఆర్టికల్ చదివారు అంటే.. టిక్ టాక్ చేసేవారిపై విరక్తి వస్తుంది. ఎందుకంటే.. టిక్ టాక్ మోజులో పడి మనుషులు ఇలా ఉన్నారా? అనే సందేహం వస్తుంది. అలా సందేహం వచ్చేలా.. ఓ వివాహిత.. టిక్ టాక్ మోజులో పడింది.. అంతే.. భర్త చేతిలో హతం అయ్యింది.. ఇలా ప్రాణాలను పోగొట్టుకుంది. 


 
ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలో కాడాంబులియూర్‌కు చెందిన కుమరవేల్‌..  నైవేలి దిడీర్‌కుప్పానికి చెందిన రాజేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరు నాలుగు నెలల నుండి బన్రూట్టి అన్వర్‌షానగర్‌ నాలుగో వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. అయితది ఆ ఇంట్లోనే ఆమె ఆదివారం రాత్రి హత్యకు గురైంది. 

 

ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్న వీరి జీవితంలోకి టిక్ టాక్ అనే దారుణం వచ్చింది. ఇంకా అంతే... టిక్ టాక్ తో ప్రేమలో పడింది.. టిక్‌టాక్‌లో పలువురి యువకులతో పాటలు పాడుతూ, డాన్సులు చేసి పోస్టులు పెట్టింది. అది భర్తకు నచ్చలేదు.. దీంతో ఆమెను మందలించాడు.. కానీ ఆమె పట్టించుకోలేదని.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశాడు. 

 

అయితే ఆమె ఒక్క టిక్ టాక్ ఏ కాదు.. అదే ప్రాంతానికి చెందిన మెకానిక్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త చెప్తున్నాడు. భార్యను హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కూడా. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ టిక్ టాక్ పిచ్చి పట్టి ప్రాణాలను పోగుట్టుకుంది.. ఇప్పుడు దీని వల్ల ఎవరికీ నష్టం.. తల్లి ఏమో అనంతలోకాలకు పోయింది.. తండ్రి ఏమో జైలుకు వెళ్ళాడు.. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు? అనాథలు అయ్యారు. ఆ పిల్లలను ఎవరు చూస్తారు? మీరు ఏ చెప్పండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: