దివ్య హత్య కేసు విచారణలో భాగంగా నిందితుడిగా అనుమానిస్తున్న వెంకటేష్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నిన్న రాత్రి అత్యంత దారుణంగా దివ్య అనే యువతి హత్యకు గురైన విషయం తెలిసిందే. దివ్య, వెంకటేష్ కు ఐదు సంవత్సరాల క్రితమే పెళ్లి కాగా పెళ్లి తరువాత విభేదాలు రావడంతో ఇద్దరూ వేరువేరుగా జీవిస్తున్నారు. దివ్యకు వేరే పెళ్లి నిశ్చయం కావడంతో వెంకటేష్ దివ్యను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 
 
కొంతసేపటి క్రితం వెంకటేష్ వేములవాడ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. దివ్య, వెంకటేష్ వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారని తెలుస్తోంది. పోలీసులు వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పోలీసులు అధికారికంగా వెంకటేష్ లొంగిపోయినట్టు ప్రకటన చేయనప్పటికీ వెంకటేష్ లొంగిపోయాడని సమాచారం అందుతోంది. కొన్ని గంటల క్రితం పోలీసులు వెంకటేష్ తల్లిదండ్రులు లత, పరశరాం గౌడ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
వెంకటేష్ తల్లిదండ్రులు 5వ తరగతిలోనే దివ్య, వెంకటేష్ ప్రేమించుకున్నారని ఇద్దరూ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజరీంగ్ పూర్తి చేశారని చెప్పారు. హైదరాబాద్ లో కోచింగ్ కు వెళ్లిన సమయంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని దివ్య తల్లిదండ్రులు అప్పట్లో సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో దివ్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేశారని చెప్పారు. దివ్య తల్లిదండ్రులు ఆ తరువాత దివ్య మనస్సు మార్చేసి విడదీశారని పోలీసులకు వెంకటేష్ తల్లిదండ్రులు చెప్పారు. 
 
 
2018 అక్టోబర్ నెలలో వెంకటేష్ తనను వేధిస్తున్నాడని దివ్య, ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. పోలీసులు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని అమ్మాయి జోలికి వెళ్లడని రాతపూర్వకంగా హామీ ఇచ్చామని చెప్పారు. చనిపోయిన వారిని చూస్తేనే తమ కొడుకు భయపడతాడని దివ్యను తమ కొడుకు హత్య చేసి ఉండడని దివ్య తల్లిదండ్రులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: