‘పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి’ అని ఓ తెలుగు హిట్ సినిమాలోని డైలాగ్. ఇదే మాటను ఎప్పటికప్పుడు నిజం చేస్తూ ఆయన ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు. సిల్వర్ స్క్రీన్ అయినా రాజకీయమైనా, సోషల్ సర్వీస్ అయినా.. పవన్ క్రేజ్ కు ఎల్లలు ఉండవు. పవన్ సినిమాలు వరుస ఫ్లాపులు అయినప్పుడూ ఆయన వెంటే ఉన్నారు. రాజకీయాల్లో వైఫల్యం వచ్చినప్పడూ ఆయన కోసమే పని చేస్తున్నారు. ఫ్యాన్స్ కు ఆదర్శంగా ఉంటూ వారిని ఉత్తేజపరుస్తున్న పవన్ కల్యాణ్ వారు గర్వపడే మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడని తెలుస్తోంది.

 

 

గత ఏడాది నేషనల్ ఫ్లాగ్ డే సందర్భంగా సైనిక కుటుంబాలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాడని సమచారం. ఢిల్లీలోని కేంద్రీయ సైనిక్ బోర్డుకు కోటి రూపాయలు విరాళంగా ఇస్తానని పవన్ ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు అతి త్వరలోనే వెళ్తున్నాడట. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ కు ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నాడట. ఈ వార్త పవన్ ఫ్యాన్స్ కు నిజంగానే పూనకాలు రప్పిస్తోంది. తమ హీరో, నాయకుడు ఇలాంటి ఉదాత్తమైన పనికి శ్రీకారం చుట్టడం తమకు గర్వకారణంగా ఫీల్ అవుతున్నారట. ఇప్పటికే దీనిపై పవన్ ఫ్యాన్స్ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

 

 

నిజానికి పవన్ కు దేశభక్తి ఎక్కువ. ఏ సినిమా ఫంక్షన్ లో మాట్లాడినా.. రాజకీయ సభలో మాట్లాడినా కూడా జైహింద్ అనకుండా తన ప్రసంగాన్ని ముగించడు. యువత, భవిష్యత్ తరాలు దేశభక్తిని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, దేశం కోసం ప్రాణత్యాగం చేసే సైనికుల గురించి తెలుసుకోవాలని కూడా పిలుపునిస్తూంటాడు. ఆయన సినిమాల్లో కూడా దేశభక్తికి సంబంధించిన పాటలు ఉంటాయి. త్వరలో క్రిష్ తో చేసే సినిమాలో కూడా ఇలాంటి భావాలున్న పాత్రే చేస్తున్నాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: