ఏంటి ? పిచ్చ ? ఎక్కడైనా ఎక్కువసార్లు స్నానం చేస్తే చంపేస్తారా? అని మీకు సందేహం వచ్చి ఉండచ్చు.. కానీ నిజంగానే ఓ భర్త భార్యను అతి కిరాతకంగా చంపేశాడు.. ఎక్కువసార్లు స్నానం చేస్తుంది అనేదే సాకుగా చూపించి భార్యను అత్యంత దారుణంగా నరికి చంపేశాడు.. ఆపై అతను కూడా ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఏంటి ఈ వింత ఘటన అని అనుకుంటున్నారా? వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన నిజంగానే జరిగింది.. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని మైసూర్‌కు చెందిన శాంతమూర్తి, పుట్టమణి దంపతులకు 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక పోతే.. ఆ కుటుంబానికి ఇక్కడ వచ్చిన కష్టం ఏంటంటే.. భార్య అయినా పుట్టమణి అతి శుభ్రత. ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది ఇది ప్రతి గృహిణి చేసే పనే.. కానీ ఈ పనులు చుడండి.. పిల్లలకు, భర్తకు పరి శుభ్రంగా ఉండటానికి ఎన్ని కండిషన్లు పెట్టింది తెలుసా? 

 

బాత్ రూమ్ కు వెళ్లిన స్నానం చెయ్యాలి.. బయట వ్యక్తులను ముట్టిన  స్నానం చెయ్యాలి.. ఇంట్లోకి ఎవరు వచ్చిన సరే.. స్నానం చేసే అడుగుపెట్టాలి. అంతేకాదు.. ఇంట్లో తీసుకొచ్చే డబ్బుని కూడా సబ్బుతో కడిగి తీసుకురావాలి.. దీనివల్ల ఆ ఇంట్లోవారు రోజుకు 10 నుండి 15 సార్లు స్నానం చెయ్యాల్సి వచ్చేది.. ఆలా చెయ్యడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు.. అయినా సరే.. నాకు నీట్ నెస్ ఏ ముఖ్యం అనేది.. 

 

పాపం భర్త.. ఈ అతి శుభ్రతను భరించకలేకపోయేవాడు.. ప్రతిరోజు గొడవలు జరిగేవి.. అవి కాస్త ఎక్కువ అయ్యాయి.. ఇంకా పక్క ప్లాన్ వేసుకున్న భర్త భార్యను పొలం పనులకు తీసుకెళ్లి పొలంలో ఉన్న కొడవలితో భార్యను అతి కిరాతకంగా దారుణంగా నరికి చంపేశాడు. అలా చేసి చంపడమే కాదు.. భార్య మరణాన్ని భరించలేని ఆ భర్త.. నేరుగా ఇంటికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరి మరణంతో ఆ ఇద్దరు పిల్లలు ఆనాధలు అయ్యారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: