ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటివరకు నడిచిన తోలుబొమ్మలాట సినిమా అయిపోయినట్లుగా ఉంది. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరమీదికి తెచ్చారు లోకేశం గారు.. ఇప్పటికే ఆయన మాటలతో, చేతలతో నవ్వులపాలవుతు, మాలోకం, వెర్రిపుష్పం అనే బిరుదులను కూడా సొంతం చేసుకున్న లోకేషం అప్పుడప్పుడు వేసే విచిత్ర వేషాలు చాలా నవ్వులను తెప్పిస్తాయి.. ఇకపోతే ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో భాగంగా పర్యటించించిన బాబుగారి ముద్దపప్పు అని పిలవబడే లోకోష్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద తనదైన శైలిలో ఫైర్ అయ్యారు..

 

 

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ తొమ్మిది నెలల పాలన నవ మోసాల పాలనగా మారిందన్నారు.. పాపం ఆకలేసినప్పుడు, వైసీపీ వాళ్లు లోకేష్‌కు సమోసాలు ఇవ్వలేదనుకుంటా ఆ కడుపుమంటతో, సమోసాలను, నవమోసాలుగా అభివరిణిస్తున్నాడు అనుకుంటున్నారట.. ఇక కొత్త భాషను కనిపెట్టిన లోకేషం, దాన్ని వైసీపీ వాళ్లు ప్రవేశపెట్టారని విమర్శించారు. అదేమంటే తెలుగులో నాన్న అంటామని, ఇంగ్లీష్‌లో ఫాదర్ అంటామని, కానీ వైసీపీ భాషలో మాత్రం ‘నీ అమ్మ మొగుడు అంటారని’ వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ ప్రవేశపెట్టిన మరొకటి ‘కక్ష సాధింపు కార్యక్రమం’ అని లోకేష్ అన్నారు.

 

 

ఈ పథకంలో భాగంగా తెలుగు దేశం పార్టీ నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం, భద్రత తగ్గించడం వంటివని తెలిపారు.. ఇంతటితో ఊరుకోకుండా మరో అడుగు ముందుకేసి రైతులకు రూ.12,500/- ఇస్తామని చెప్పి.. ఇప్పుడు దానిని రూ.7,500/- కుదించారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు సెక్యూరిటీ విషయంపై కూడ స్పందిస్తూ, ఆయనకు సెక్యూరిటీ కుదించడం కుట్రపూరిత చర్య అన్నారు. ఇకపోతే నేను కూడా మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్నానని లోకేష్ బాంబు పేల్చారు..

 

 

అయినా గానీ నువ్వు మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉండటం ఏంటి లోకేషా, అసలే పసిపిల్లాడివి, పప్పుముద్దలు, తుప్పుపట్టిన తుపాకుల గురించి తప్పా, మావోయిస్టుల గురించి తెలియని నువ్వు, అలా వారిని కూడా వాడేసుకోకు ఎందుకంటే నిజంగానే హిట్ లిస్టులో చేర్చి తీసుకెళ్లి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చంద్రుడు చీకటి అయిపోతాడు. అంత పెద్ద మాటలు ఎందుకు గాని పో పోయి రాజకీయాల్లో అ ఆ లు నేర్చుకుని రాపో అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: