ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ పేరువింటే పసిపిల్లాడు కూడా ఉక్కబట్టి ఏడుస్తాడు.. అంతటి నీచుడు. మానవత్వం అంటే తెలియని కర్కోటకుడు.. భారత్ పై దాడి చేసి అమాయకులను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు.. అసలు భారతదేశం అంటే ఓ విషపు దేశంగా భావించిన కసబ్, ఇక్కడి వారి మీద దాడి చేసి మారణహోమాన్ని సృష్టించాడు.. ఇకపోతే చిన్నప్పటి నుండి కసబ్కు భారతంటే కోపం, ద్వేషం కలిగేలా ట్రైనింగ్ ఇచ్చారని, అతను తమ మతం వారికి భారత్లో తీవ్రమైన అన్యాయం జరుగుంతుందనే భ్రమలో బ్రతికేలా చేసి ఉగ్రవాదిగా మార్చి ‘లష్కర్ ఈ తోయిబా మనదేశం పైకి ఉసిగొల్పిందని తెలుస్తుంది.
ఇకపోతే గతంలో ముంబై పోలీస్ కమిషనర్గా పనిచేసిన రాకేష్ మారియా ఒక నమ్మలేని నిజాన్ని బయటపెట్టాడు. అదేమంటే పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్తో తాను భారత్ మాతాకీ జై అనిపించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఆత్మకథలో రాసుకున్నారట.. ఇదే కాకుండా అప్పటివరకు ద్వేషంతో రగిలిపోతున్న కసబ్ కళ్లకు భారత్లో ముస్లింలు స్వేచ్ఛగా మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవచ్చునని నిరూపించినట్టు తెలిపారు.
ఇక కసబ్ నమ్మే నిజాన్ని అబద్ధం అని నిరూపించడానికి కసబ్ ను, కాన్వాయ్ లో తీసుకుని,మెట్రో జంక్షన్ వద్దకు వెళ్లాం, కసబ్ అక్కడకు వచ్చాక నేల మీద కూర్చుని నుదుటిని నేలకు తాకించమని ఆదేశించా. అతడు నేను చెప్పినట్టే చేశాడు. ఇప్పుడు భారత్ మాతాకీ జై అను అని ఆదేశించా, కసబ్ ‘భారత్ మాతాకీ జై’ అన్నాడు. అంతటితో అయిపోలేదు. మరో రెండుసార్లు అలా అనిపించా అని ఆ కమిషనర్ తెలిపారు..
ఆ తర్వాత మెట్రో సినిమాకు దగ్గరలోనే ఉన్న ఓ మసీదుకు అతడిని వాహనంలో తీసుకెళ్లాం. అక్కడ ముస్లింలు ప్రార్థన చేసుకుంటున్నది తన కళ్లతో తానే స్వయంగా చూసిన కూడా అతడు దాన్ని నమ్మలేకపోయాడు.’ అంటే దీన్ని బట్టి అర్ధం అయ్యేది ఏంటంటే భారత్ మీద ఎంత విద్వేషాన్ని అతని మనుసులోనింపి ఇక్కడికి పంపించారో ఆ ముష్కరులు.. అని రాకేష్ మారియా తన ఆత్మకథలో పేర్కొన్నారు.
ఇకపోతే ముంబైలో జరిగిన ఈ మారణ హోమంలో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలతో పట్టుకున్న ఏకైక ఉగ్రవాది కసబ్ మాత్రమే. ఇక ఇతన్ని 2012 నవంబర్ 21న ఉరి తీశారు...