బ్యాంకులో లోను కావాలంటే..ఎవరైనా తెలిసిన వాళ్లుంటే కాస్త తొందరగా పని అవుతుందనుకుంటాం.. ఏదైనా లోను కోసం సవాలక్ష నిబంధనలు ఉంటాయి. కానీ ఆ బ్యాంకులో తెలిసిన వాళ్లుంటే పని కాస్త ఈజీ అవుతుంది. ఈ వెసులుబాటును బాగా వాడుకున్నాడో బ్యాంకు ఉద్యోగి. తన వద్దకు లోను కోసం వచ్చే లేడీ కస్టమర్లను రుణాల పేరుతో బుట్టలో వేసుకున్నాడు. నాతో కాస్త సహకరిస్తే మీకు లోను ఈజీ అంటూ మభ్యపెట్టాడు.

 

ఎలాగైతేనేం.. మొత్తం 200 మంది వరకూ మహిళలను రుణాల పేరుతో బుట్టలో వేసుకున్నాడు. వారితో శృంగారం చేస్తూ.. ఆ వీడియోలు రికార్డు చేశాడు. ఇలా మొత్తం 200 అశ్లీల వీడియోలు అతని మొబైల్లో ఉన్నాయి. అయితే ఈ గుట్టు అనూహ్యంగా అతని భార్య కారణంగా ప్రపంచానికి వెళ్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్‌ జయకుమార్‌ పుదుకోట్టై జిల్లాలోని ఓ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు.

 

ఇటీవల అనుకోకుండా తన భర్త మొబైల్ చూసిన భార్య షాకైంది.. భర్తకు తెలియకుండా అతడి రెండు సెల్‌ఫోన్లను భార్య పరిశీలించింది. వాటి నిండా దాదాపు 200 అశ్లీల వీడియోలు కనిపించాయి. అనేకమంది మహిళల బ్యాంకు ఖాతాల వివరాలూ ఉన్నాయి. బ్యాంకుకు వచ్చే మహిళా ఖాతాదారులు, ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండే మహిళల అసభ్య వీడియోలు కనిపించడంతో ఆమె ఒక్క సారిగా షాకైంది.

 

క్రమంగా ఈ విషయంపై ఆరా తీసింది. జయకుమార్ కు మహిళలను లొంగ దీసుకునే విషయంలో ఆయనకు బ్యాంకులో పనిచేసే ఓ మహిళ సహకరించినట్లు తెలుసుకుంది. అయితే ఈ విషయం భార్యకు తెలిసిందని తెలుసుకున్న జయకుమార్ ఆమెపై హత్యాయత్నం కూడా చేశాడట. అంతే కాదు.. తాను వాడుతున్న మరో 13 సెల్‌ఫోన్లలో సమాచారాన్ని డిలీట్‌ చేసేశాడు. దీంతో జయకుమార్ భార్య పోలీసులను ఆశ్రయించింది. అనేక ఆధారాలను బయటపెట్టింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: