ఈ మద్య మహిళలపై అత్యాచారాలు బాగా పెరిగిపోతున్నాయి. పెద్దా చిన్నా వావి వ‌ర‌స మరిచి చిన్న పిల్లలు, ముదుసలి అన్న తేడా కూడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఇక తాజాగా కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు మ‌ర‌ద‌లిపై క‌న్నేశాడు. అడ్డుగా ఉన్న సొంత తమ్ముడిని చంపేసిన ఆమెను దక్కించుకోవచ్చనుకుని పథకం వేశాడు. ఓ వ్యక్తిని సుపారీ ఇచ్చి అతడిని దారుణంగా హత్య చేయించాడు. పాపం పండటంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన సత్యప్రసాద్, లక్ష్మణ్ కుమార్ వరుసకు అన్నదమ్ములు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నారు. 

 

ఆ తరువాత ఉపాధి కోసం బెంగుళూరుకు వెళ్లారు. ఈ క్రమంలోనే సత్యప్రసాద్ తమ్ముడి భార్య శ్రీజపై కన్నేశాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని కోరగా ఆమె తిరస్కరించింది.  లక్ష్మణ్ కుమార్ ను చంపేస్తే తానే వస్తుందని భావించాడు. ఈ నేపథ్యంలోనే దినేష్ అనే కిరాయి హంతకుడితో డీల్ కుదుర్చుకున్నాడు. లక్ష్మణ్ కుమార్‌ను హత్య చేస్తే 15 లక్షలతో పాటు, హైదరాబాద్ లో ఉన్న సొంత ఇంటిని కూడా ఇచ్చేస్తానని కిరాయి మాట్లాడుకున్నాడు. ఈ క్ర‌మంలోనే దినేష్.. లక్ష్మణ్‌ను ఫాలో అవ్వాల్సిందిగా తన సహచరులైన ప్రశాంత్, ప్రేమ్, లోకేశ్, కుశాంత్, ఆంజనప్ప, రవికి ఆదేశించాడు. 

 

దీంతో రోజువారి దినచర్యలకు వెళ్తున్న లక్ష్మణ్ కుమార్‌ను గమనించిన దినేశ్ ముఠా.. ఈ నెల 3వ తేదీన మహదేవపుర వంతెన వద్ద అతన్ని చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపారు. ఆపై అతని సొంత అన్న రాజశేఖర్ కు ఫోన్ చేసి, తమ్ముడు హత్య చేయబడ్డాడని చెప్పి, పరారయ్యారు. అయితే ఈ ఘటన గురించి తెలుసుకున్న లక్ష్మణకుమార్  సొంత‌ అన్న రాజశేఖర్ మహదేవపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి సత్యప్రసాద్ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య తానే చేయించినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు దినేశ్‌ ముఠాను కూడా పట్టుకుని జైలుకు తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: