ఈ రోజుల్లో సినిమాలకు ఎంత క్రేజీ ఉందో అంత కంటే ఎక్కువ టీవీ సీరియల్స్ కి ఉంది. మహిళలు వారి పని పూర్తి చేసుకొని సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి సీరియల్ ని వారు అభిమానిస్తారు. చిన్న స్క్రీన్ అయినా కోట్లాది మంది ప్రేక్షకులను మనసు గెలుచుకుంది. పెద్ద స్క్రీన్ మీద పని చేసిన వారు సైతం ఇప్పుడు చిన్న స్క్రీన్ పై నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 

ప్రస్తుతం ఈ రోజుల్లో మహిళలు టీవీ సీరియల్స్‌కు ఎంతలా అడిక్ట్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇంటి పనులు కూడా మానేసి సీరియల్స్ చూస్తూ జీవితాన్ని గడిపేవారు కూడా ఉంటున్నారు. సీరియల్స్ ప్రభావంలో పడి కట్టుకున్న భర్త మాటలు కూడా లెక్కచేయని మహిళలు ఎందరో ఉన్నారు. టీవీ సీరియల్స్ పిచ్చిలో పడి ఓ మహిళ ఏకంగా ప్రాణాలే కోల్పోయింది ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

 

మదురై కామరాజపురం భగత్‌ సింగ్‌ వీధికి చెందిన రమేష్‌, మహాలక్ష్మి(41) దంపతులు. మనస్పర్థల కారణంగా వీరు కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. రమేశ్ ఇద్దరు పిల్లలను తీసుకుని భగత్‌సింగ్ వీధిలో నివాసము ఉంటున్నారు. ఒంటరితనం వల్ల ఆమె టీవీ సీరియల్స్‌కు బానిసైంది. రోజూంతా సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం దేవుడి ముందు దీపం వెలిగించిన మహాలక్ష్మి తర్వాత టీవీ సీరియల్ చూస్తోంది.

 

అదే సమయంలో దీపం కింద పడిపోయి మంటలు అంటుకున్నాయి. క్రమంలో మంటలు గది అంతా వ్యాపించి మంటలు చెలరేగినా మహాలక్ష్మి సీరియల్‌ను ఇంట్రస్టింగ్‌గా చూస్తూనే ఉంది. ఆమె ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఆమెకు చెప్పగా షాకైంది. మంటలు ఆర్పేందుకు గదిలోకి వెళ్లి సజీవ దహనమైంది. ఆమెకు రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినా అప్పటికే మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: