మీటు ఉద్య‌మంతో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన స్వాతి త‌న భ‌ర్త నుంచి విడాకులు తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇంత‌కు స్వాతి అంటే ఎవ‌రో అన్న సందేహాలు రావ‌డం స‌హ‌జం.. ఆ స్వాతి ఎవ‌రో కాదు దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఉధృతంగా జ‌రుగుతున్న‌ సమయంలో స్వాతి భర్త .. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్లు ఈ దంప‌తుల మ‌ధ్య చిచ్చు పెట్టాయి. అప్ప‌టి నుంచి వీరి మ‌ధ్య ఏర్ప‌డిన గ్యాప్ అలాగే  కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే వీరి గ్యాప్ పెరిగి పెద్ద‌ది అవ్వ‌డంతో పాటు అది వీరి మ‌ధ్య పూడ్చ‌లేనంత అగాధంగా మారింది. చివ‌ర‌కు అది విడాకుల‌కు దారి తీసింది.

 

గ‌త రెండేళ్లుగా న‌లిగి న‌లిగి వ‌స్తోన్న ఈ వివాదం ఎట్ట‌కేల‌కు విడాకుల‌తో ముగిసింది. వీరిద్ద‌రు చ‌ట్ట‌బ‌ద్ధంగా విడిపోయారు. ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతి మ‌లివార్ అంటే దేశ రాజ‌ధానిలో తెలియ‌ని వాళ్లు ఉండ‌రు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా క్రియాశీల‌కంగా పాల్గొంటారు. ఈ దంప‌తులు ఇద్ద‌రూ ప్ర‌స్తుతం ఆప్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆప్ హ‌ర్యానా క‌న్వీన‌ర్‌గా స్వాతి భ‌ర్త న‌వీన్ జైహింద్ (39) కొనసాగుతున్నారు.

 

అతి చిన్న వ‌య‌స్సులోనే స్వాతి ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దేశంలోనే అత్యంత చిన్న వ‌య‌స్సులో ఈ ప‌ద‌వి చేప‌ట్టిన మ‌హిళ‌గా స్వాతి రికార్డుల‌కు ఎక్కారు. ఈ సంద‌ర్భంగా స్వాతి భ‌ర్త‌తో విడాకుల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియ వేదిక‌గా ఓ భావోద్వేగ పోస్టు కూడా పెట్టారు. ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎస్‌ఎస్‌ కాలేజీలో ఐటీలో స్వాతి డిగ్రీ చేశారు. అన్నా హజారే నేతృత్వంలో ఉధృతంగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె కీల‌కంగా ప‌నిచేశారు. 

 

అన్నా హ‌జారే నేతృత్వంలో కొన‌సాగుతున్న ఉద్య‌మ స‌మ‌యంలోనే ఆమెకు జైహింద్‌తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం నేప‌థ్యంలో వీళ్లిద్ద‌రు ముందుగా స‌హ‌జీవ‌నం చేసి.. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించిన స్వాతికి నిరాశే ఎదురైంది. దీంతో స్వాతికి మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవి దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: