కామాతురానాం.. నభయం న లజ్జ అని కామంతో ఉన్నవారు ఉచ్చనీచాలు ఆలోచించరు అన్న విషయం తెలిసిందే.  ఈ మద్య దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే.  మరీ దారుణమైన విషయం ఏంటేంటే చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి.  అయితే ఓ బాధ్యతగల ఉద్యోగం చేస్తూ ఓ వ్యక్తి వివాహ బంధాన్ని మర్చిపోయి ఏకంగా నలభై మంది ఆడవారితో రాసలీలలు చేస్తూ అడ్డంగా ఆయన భార్యకే బుక్కయ్యాడు.  అతని భార్యే ఫోటోలు, వీడియోల ఆధారంతో బయట పెట్టింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ వ్యక్తి పరారీలో ఉన్నాడు.  తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుక్కోట్టై జిల్లా వీరాలిమలైలోని ఇండియన్ బ్యాంకు లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు.

 

ఇతనికి తంజావూరు జిల్లా రెడ్డిపాలయానికి చెందిన మహిళ వివాహం జరిగింది.  పెళ్లై తన భర్తతో హాయిగా ఉండాలని వచ్చిన ఆయన భార్యకు తెల్లారి నుంచే చక్కలు కనిపించాయి. ఇంట్లో ఉన్న ఒక ప్రత్యేక గదిలో గంటల తరబడి కొంత మంది మహిళలతో జయకుమార్ సన్నిహితంగా మాట్లాడటం, తనతో సఖ్యత ఉండకపోవడాన్ని గమనించిన యువతి భర్త ఉద్యోగానికి వెళ్ళాక అతని గదిలోకి వెళ్లి పరిశీలించింది. అతని వద్ద ఉన్న పదిహేను సెల్ ఫోన్లలో ఆడవారి నగ్న ఫోటోలు... వీడియోలు, మెసేజ్ లో చూసి షాక్ కి గురైంది.  ఎంతో మంచి వాడు అనుకుని, ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడని భావించి పెళ్లి చేసుకుంటే సదరు వ్యక్తి ఇంత దారుణాలు చేస్తున్నాడా అని ఆవేదన చెందింది.

 

ఈ విషయం అత్త, ఆడపడుచుకు చెబితే వారు పట్టించుకోలేదు. తన బండారం గురించి తెలిసిందని జయకుమార్   కోపంతో భార్యను తిట్టాడు. అంతే కాదు తాను స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీశానని.. తన గురించి చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.  దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.  భర్త జయకుమార్, అత్త విల్లీ హైడా, ఆడపడుచు కేథరిన్‌ నిర్మలామేరీ, బంధువు రీటాతో పాటుగా, జయకుమార్‌తో సంబంధం పెట్టుకుని అతడి దుర్మార్గాలకు సహకరించిన బ్యాంకు ఉద్యోగిని దేవీ బిలోమినాపై మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: