ప్రేమించిన పాపానికి ఓ యువతీ దారుణంగా చనిపోయింది.. జీవితాంతం తోడు ఉంటానని చెప్పిన అతను ఆమె జీవితానికి త్వరగా చరమగీతం పాడటం పై దారుణం చోటుచేసుకుంది. ప్రేమించుకున్నాం ఇంకెన్ని రోజులు ఒంటరిగా ఉంటాము పెళ్లి చేసుకో అని ఆ అబ్బాయిని తొందర పెట్టడంతో తొందరగా దేవుడి దగ్గరకు వెళ్ళింది. ఈ దారుణ సంఘటన కేరళలో చోటుచేసుంది. వివరాలిలా.. 

 

 


త్వరగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకు ఓ యువతిపై బాయ్‌ఫ్రెండ్ కుటుంబ సభ్యులు దారుణానికి ఒడిగట్టారు. వివాహం గురించి చర్చించుకుందామని నమ్మించి ఆమెను వాళ్లింటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.అదే విషయాన్ని పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే రబీవుల్ కుటుంబ సభ్యులు షంపాను కోడలిగా అంగీకరించలేదు. 

 

 

అయితే .. ఆమెతో వివాహానికి నిరాకరించారు. అమ్మాయి తండ్రి దాలా షేక్‌కి విషయం చెప్పగా ముందు అబ్బాయి ఇంట్లో ఒప్పిస్తే తనకి అభ్యంతరం లేదని చెప్పి పంపాడు.అప్పటి నుంచి త్వరగా ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని షంపా.. తన బాయ్‌ఫ్రెండ్ రబీవుల్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఓ రోజు రబీవుల్.. అతని తల్లి, అత్త, నాయనమ్మ కలిసి యువతి ఇంటికెళ్లారు. వివాహం గురించి మాట్లాడదామని చెప్పి ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. 

 


అన్నీ కూర్చొని మాట్లాడదామని ఇంటికి తీసుకెళ్లి నువ్వంటే మాకిష్టం లేదు.. మా అబ్బాయిని వదిలి పెట్టు అని నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆ యువతీ ససేమిరా అనడంతో కోపోద్రులైన వారు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 80 శాతాన్ గాయాల పాలైన ఆమె చుట్టూ పక్కల వాళ్ళు తీసుకెల్లి ఆసుపత్రిలో చేర్పించారు .. చికిత్స పొందుతూ ఆ యువతీ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: