టాలీవుడ్ లో వివాదాలకు కొదవ లేదు. హీరో – దర్శకులు, హీరో – నిర్మాతలు, దర్శకులు – నిర్మాతల మధ్య తరచూ గొడవలు, మనస్పర్థలు చూస్తూనే ఉంటాం. ఈ గొడవలు సినిమా షూటింగ్ మధ్యలో కానీ.. రిలీజ్ అయ్యాక గానీ బయటకొస్తాయి. మరికొన్ని సినిమా హిట్ అయి వెళ్లిపోయాక బయటకొస్తాయి. ఇటువంటి వివాదమే యూత్ హీరో నాగ శౌర్య, దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో సినిమా విషయంలో ఇద్దరికీ జరుగుతోంది. సినిమా విడుదలై రెండేళ్లు గడిచినా ఇప్పటికీ వీరిద్దరి ఇష్యూ ఇంకా జరుగుతూనే ఉంటుంది.

 

 

 

ఛలో సినిమా విజయవంతం కావడంలో తన పాత్ర ఉందని నాగశౌర్య ఓ పెద్ద బాంబే పేల్చాడు. దర్శకుడు వెంకీ కుడుముల రాసుకొచ్చిన కథ ఒకటైతే దానికి మరిన్ని హంగులు అద్దడంలో తన పాత్ర చాలా ఉందని చెప్పి సంచలనం రేపాడు. పైగా.. సినిమా హిట్ అయినందుకు తన తల్లి ఓ కారును వెంకీకి బహమతి ఇవ్వగా నిరాకరించాడని కూడా ఆరోపించాడు. దీంతో వీరిద్దరి మధ్యా మనస్పర్ధలు వచ్చాయని అంటున్నారు. దీనిపై వెంకీ కుడుములకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయంపై తాను మాట్లాడటానికి సిద్ధంగా లేనని అన్నాడు. ఎంతలేదన్నా తనకు సినిమా దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడటం ఇష్టం లేదన్నట్టుగా స్పందించాడు.

 

 

 

నాగశౌర్య కూడా ఏదో అనాలోచితంగా వెంకీని ఓ మాట అని ఉంటాడనే అంటారు. విషయం పెద్దిది కాకుండా వెంకీ ఫుల్ స్టాప్ పెట్టేశాడని అంటున్నారు. వెంకీ దర్శకత్వం వహించిన రెండో సినిమా భీష్మ ఈరోజు ధియేటర్లలోకి రానుంది. ఇటివల విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త దర్శకులకు టాలీవుడ్ లో ఎదురయ్యే సమస్యను ప్రస్తుతం వెంకీ కుడుముల అధిగమించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ తో అంచనాలను పెంచేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: