ఈ మధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల కాలు బయట పెడితే చాలు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్ల కామపు కోరల్లో చిక్కుకోవాల్సిన  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆడది అర్ధరాత్రి బయట తిరిగినప్పుడే అసలైన స్వాతంత్రం అన్నారు మహానీయులు కానీ పగలు కూడా బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో ఆడపిల్లలకి. ఎక్కడికి వెళ్ళినా ఆడ పిల్లలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇక కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాల్లాంటి  మగాళ్ళు... చిన్నపిల్లలను కూడా వదలడం. అతి దారుణంగా అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. 

 

 

 తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది... వివరాల్లోకి వెళితే... ఎనిమిదేళ్ల బాలికకు పానీపూరి సమోసా ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బి.కె గూడా కు చెందిన దంపతులు చెత్త ఏరుకునీ  జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం వీరి మూడో కుమార్తె... తల్లి వద్దకు వచ్చి అంకుల్ పానీపూరి సమోసాలు కొనిస్తానని పిలుస్తున్నాడని  వెళ్తాను అంటూ తల్లికి చెప్పగా..  కోప్పడిన తల్లి ఎక్కడికి వెళ్ళద్దనీ  చెప్పి భోజనం పెట్టి నిద్రపుచ్చింది. ఇక కాసేపటికి తన కూతురు కన్పించకపోవడంతో కంగారు పడిన తల్లి చుట్టుపక్కల వెతికింది.

 

 

 ఈ క్రమంలోనే సమీపంలోని సెక్యూరిటీ  గార్డు వద్ద పాప గురించి ఆరా తీయక.. ఓ వ్యక్తి పాప తో పార్కులోని బాత్రూం వద్ద కనిపించాడని నేనే మందలించి  అక్కడినుంచి పంపించాను అంటూ సెక్యూరిటీ గార్డ్ తెలపగా... తన కూతురిని వెతుకుతూ ఈ ఎస్ ఐ హాస్పిటల్ వైపుగా వచ్చింది. ఇక అక్కడే నిందితుడు నాగరాజు పాపతో కనిపించాడు. ఈ క్రమంలోనే నిందితుడి నుండి పాపను  విడిపించిన తల్లి ఏం జరిగింది అని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పానీపూరి సమోసా కొనిస్తానని చెప్పి తనను బాత్రూం లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ ఆ చిన్నారి చెప్పడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది ఆ తల్లి.ఇక  నిందితుడు నాగరాజుపై పోక్సో  చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: