ఈరోజుల్లో మహిళలపై రోజురోజుకు ఈ లైంగిక వేధింపులు ఎక్కువ అయిపోతూన్నాయి. సొంత వారి నుండి  లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది నేటి రోజుల్లో మహిళలకు. ఇక్కడ ఓ ప్రబుద్ధుడు తన నీచ బుద్ది ని చూపించాడు. భార్య అనారోగ్యం పాలవడంతో అదే అవకాశంగా మలుచుకుని తన మరదలిని లైంగిక వేధింపులకు గురిచేశాడు ఇక్కడ ఒక దుర్మార్గుడు. ఏకంగా పదేళ్ల పాటు నరకం చూపించాడు. తన మరదలి నగ్న ఫోటోలను తీసి ఫేస్బుక్లో పెట్టి వికృత ఆనందం పొందేవాడు . కొన్ని రోజులపాటు అక్క భర్త పెడుతున్నా టార్చర్ భరించింది... ఆ తర్వాత ఓపిక నశించి గుంటూరు రూరల్ ఎస్పీ స్పందన కార్యక్రమం లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 


 వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చెందిన యువతికి  2010లో అదే గ్రామానికి చెందిన రవి కిరణ్ తో వివాహం జరిగింది. ఆమెకు ఓ చెల్లెలు ఉంది.  బాలిక వయస్సు పదిహేనేళ్లు. సదరు మహిళ అనారోగ్యానికి గురైన సమయంలో తన చెల్లిని ఇంటికి పిలిపించుకుని పనులు చేసే సాకుతో రవికిరణ్ ఆ బాలిక పై  లైంగిక వేధింపులకు గురిచేశాడు. కాగా  తెలిసీ తెలియని వయసులో ఎవరికీ చెప్పుకోలేక మొదట్లో మౌనంగా భరిస్తు వచ్చింది సదరు  మైనర్ బాలిక. ఒకసారీ  ఎదురుతిరిగితే.. ఈ విషయం ఎవరికి చెప్పినా మీ అక్క కాపురం  నాశనం అవుతుంది అంటూ బెదిరింపులకు దిగాడు.నిజం తెలిస్తే అక్క ఏమైపోతుందో అని భయంతో బయటకు ఎవరికి చెప్పకుండానే ఉండిపోయింది. 

 

 ఈ క్రమంలోనే... 2018 జూలై లో ఆమె తమిళనాడులోని వేలాంగిని  దేవాలయానికి తీసుకెళ్ళిన తాళి కట్టి  కామకోర్కెలు తీర్చుకున్నాడు. ఇక తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికిరణ్ ఆ యువతితో కలిసి తెనాలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఇష్టపూర్వకంగానే తాను వెళ్లానని సదరు బాధిత యువతి తో బలవంతంగా చెప్పించాడు రవి కిరణ్. ఇక యువతిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆ యువతి అక్కను రోజూ కొడుతూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆ యువతి తల్లిదండ్రులు యువతికి పెళ్లి  చేసేందుకు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొనీ..  యువతి నగ్నంగా ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. దీంతో అక్క మొగుడు టార్చర్ తట్టుకోలేక పోయిన సదరు యువతి.. తన బావ నుంచి రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్పందన కార్యక్రమం లో తన ఆవేదనను తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: