అధికారంలో ఉన్న మన ఆహంకారమో లేక మరొకటో తెలియదు కానీ మధ్య బీజేపీ నేతలు వరుసబెట్టి చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు చాలా దుమారం రేపుతున్నాయి. మాత్రం అడ్డూఅదుపూ లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఒకరు మహిళల నెలసరి పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్వామి కృష్ణ స్వరూప్ బహిరంగ సభలో ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

 

విషయం ఏమిటంటే స్వామి కృష్ణస్వరూప్ మాట్లాడుతూ నెలసరి సమయంలో భర్తలకు వంట చేసే భార్యలు మరుజన్మలో ఆడ కుక్కల్లా పుడతారని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పుడు అనేక మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. ఒక గౌరవనీయమైన స్థాయిలో ఉండి మరియు స్వామీజీగా కీర్తింపబడే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి అని ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

 

ఒక మహిళ అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తూ ఫోటో ఒకటి షేర్ చేసి "ఇందులో ఇద్దరు మహిళలు ఇప్పుడు కుక్కలు అయ్యారు.... వాళ్ళు చేసిన పాపం ఏమిటంటే గత జన్మలో నెలసరి లో ఉండగా తమ భర్తలకు వంట చేయడమే" అని ఎద్దేవా వేశారు.

 

దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ రెండింటిలో మీరు ఎవరు?’’ అని ఆమెను ఎదురు ప్రశ్నించడంతో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మండిపడ్డారు. ‘‘బీజేపీ జాతీయ ప్రతినిధి బహిరంగ వేదికపై మహిళలను దూషిస్తున్నారు. ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం అగర్వాల్ జీ, మీ తల్లిదండ్రులు మీకు దేవుడి పేరు పెట్టారు. కనీసం పేరుకైనా విలువ ఇవ్వండని కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: