ఈ మధ్యకాలంలో చిన్నచిన్న గొడవలకు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఏకంగా తమ ప్రియమైన వారిని కడతేరుస్తున్నారు . ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో ఎన్నో  తెర మీదికి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. భార్య భర్తల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. గొడవ తో క్షణికావేశానికి లోనై నా భర్త భార్యను అతి దారుణంగా చంపేశారు. అనంతరం పోలీసులకు దొరికిపోతానేమో  అని భయంతో ఎంత పని చేసాడు అంటే... తాను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 బొమ్మనహల్ మండలం తారగాపురం గ్రామానికి చెందిన ఉల్లిగమ్మ ఏదన్న దంపతులు. వీరిద్దరికీ ఏకైక కుమారుడు సురేష్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండే వాడు . అయితే ఇతనికి వేరే గ్రామానికి చెందిన లలిత అనే యువతితో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. అయితే 9 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ లలిత గర్భం దాల్చలేదు. ఈ క్రమంలోనే సంతానం కోసం దగ్గరలోని కళ్ళుహోలా  గ్రామంలోని పీర్ల దేవుని గుడికి వెళ్లారు . అయితే పలుమార్లు గుడికి వెళ్లిన ప్రత్యేక పూజలు చేసినా ఆమెకు గర్భం రాలేదు. ఈ క్రమంలోనే ఈ విషయం పై  దంపతులిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. 

 

 

 ఇక మాటా మాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి గురైనా  సురేష్ కోపంతో భార్యను నేలకేసి కొట్టాడు. దీంతో  తలకు తీవ్ర గాయమైన లలిత అక్కడికక్కడే మృతి చెందింది. అయితే క్షణికావేశంలో భార్యని  నేలకేసి కొట్టిన సురేష్ ఆ తర్వాత భార్య రక్తపు మడుగులో ఉండటం చూసి తాను చేసిన తప్పేమిటో అర్థం అయింది.  దీంతో భయంతో వణికిపోయాడు. పోలీసులు అతన్ని పట్టుకుని ఎక్కడ శిక్షిస్తారు అని భయంతో ఇంటి సమీపంలోనే ఉన్న  వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను కర్నూలు కన్నెకల్లు  ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: