మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.  అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి పండు ముసలి వరకు అందరూ కామపు కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉన్నారు. ఆడపిల్లలపై అత్యాచారం చేస్తే కఠినంగా శిక్షించడానికి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఎవరిలో కొంచెం అయినా భయం కనిపించదు.యథేచ్ఛగా  అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు. కాగా ఈ మధ్య అభశుభం తెలియని ఆడపిల్లలపై అత్యాచారాలు హత్యలు ఘటనలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులు కామపు కోరల్లో చిక్కుకొని బలైపోతున్నారు. మహిళలపై అత్యాచారాలు చేసి అతి దారుణంగా హత్య చేస్తున్నారు. 

 

 

 తాజాగా ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్లోని బరేలి రీజియన్లో... మితౌలీ  పోలీస్ స్టేషన్ పరిధిలోని... కనఖేడ  గ్రామ శివారులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కనఖేడ  గ్రామ శివారులోని చెరుకుతోటలో... చెట్టు కింద చేతులు కట్టేసి నగ్నంగ ఉన్న ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. వివరాల్లోకి వెళితే... కనఖేడ  గ్రామానికి చెందిన బాలిక ఆడుకోవడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఈ క్రమంలోనే ఆందోళన చెందిన తల్లిదండ్రులు కూతురు కోసం సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. కాగా  ఆ తర్వాత రోజు చెరుకు తోటలు అర్థనగ్నంగా చేతులు కట్టేసి ఉన్న బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

 

 

 అయితే బాలిక చేతులు కట్టేసి ఉండడం ఆమె ఒంటిపై కనీసం దుస్తులు లేకపోవడంతో ఆమె పై అత్యాచారం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గ్రామంలోని పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కాగా ఆడుకోడానికి వెళ్ళిన తన కూతురు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: