మహిళలు ఎక్కడ రక్షణ లేదు అన్న విషయం తెలిసిందే..  ఈ మధ్య వీరిపై ఈ అఘాయిత్యాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇంట్లో నా అనుకున్న వల్లే ఆమెపై బెదిరింపులకు లైంగిక దాడులకు దిగుతున్నారు. అందుకే ఈ మధ్య అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై మహిళా సంఘాలు ఎంత ఎక్కువగా ఆందోళనలు చేస్తున్న కూడా కామాంధుల తీరు ఎక్కడ మారినట్లు కనపడుట లేదు. 

 


అక్కను పెళ్లి చేసుకుని మరదలిపై కన్నేశాడో కామాంధుడు. అక్క కాపురం కూలిపోతుందని భయపడిన మరదలు.. బావ లైంగిక వేధింపులను మౌనంగా భరించింది. ఓ రోజు ఏకంగా ఊరు దాటించేసి ఆమెపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోందని తెలసి మరింత నీచానికి దిగజారాడు. ఆమె ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. అవి చుసిన ఆమె బావ ఆగడాలను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. 

 


గుంటూరు జిల్లా కొల్లూరు మండలానికి చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన కె.రవికిరణ్ అనే వ్యక్తితో 2010లో వివాహమైంది. అప్పటి నుంచే భార్య చెల్లెలి(15)పై కన్నేశాడు బావ రవికిరణ్. తనను ఎలాగైనా లోబరచుకోవాలని ఎదురుచూస్తున్న తరుణంలో భార్య అనారోగ్యం కలిసొచ్చింది.అలా ఆమెకు బాగాలేక పోవడంతో కోరికలు తీర్చాలని బలవంతం చేసాడు. మా కూతురు కనిపించడం లేదంటూ అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలుసుకున్న రవికిరణ్.. మరదలితో కలిసి తమిళనాడులోని నాగపట్నం నుంచి నేరుగా తెనాలి పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. అయితే అక్కడ తల్లిదండ్రులకు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ ఎదురైంది.

 


తర్వాత గుడికి వెళదామని చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అనంతరం తాళి కట్టి కామవాంచనను తీర్చుకున్నాడు. వయస్సులో ఉన్న కూతురు కనిపించకుండా పోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ నిజాలు బయటకు వచ్చాయి. ఇద్దరు కూర్తుర్ల జీవితం నాశనమైందని తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: