కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంకా చాలామంది పలువురు ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ సభను నిర్వహించారు. ఇటువంటి సందర్భంలో వేదిక మీదకు అమూల్య అనే యువతి మైక్ అందుకొని పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయటం అందరికి షాక్ కు గురిచేసింది. ఇదే సందర్భంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ కూడా స్టేజీపై ఉండటంతో ఆమె నోటినుండి వచ్చిన నినాదంతో అసద్ షాక్ తిన్నారు. పాత వేదికపై ఉన్న వాళ్లు వెంటనే తేరుకుని ఆమె దగ్గర నుండి మైకు లాక్కోవడం జరిగింది.

 

దీంతో ఈ వీడియో మరియు అమ్మాయి పేరు సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో దేశ వ్యాప్తంగా సంచలనం న్యూస్ అయ్యింది. ఎప్పుడు ఫైర్ బ్రాండ్ మాదిరిగా ఇతరుల పై విరుచుకుపడే అసదుద్దీన్ ఈ ఘటన చూసి సభ నిర్వాహకులపై తర్వాత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇదే సమయంలో ఈ సభను నిర్వహించిన వాళ్ళు తమకి ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. మరోపక్క ఈ వీడియో చూసిన సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు అమ్మాయి స్టేజి మీద మాట్లాడిందని తీవ్ర స్థాయిలో ఆమెపై విరుచుకు పడ్డారు.

 

అయితే మరోపక్క సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ అమ్మాయి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ తరవాత హిందూస్థాన్ జిందాబాద్ అంటూ అన్నీ దేశాలకీ జిందాబాద్ చెప్పాలి అందరూ బాగుండాలి అని చెప్పబోతోంది .. ఆ క్రమం లో ఆమెని లాక్కెళ్లిపోయారు .. వినే ఓపిక లేదు ఎవరికీ అంటూ కొంతమంది ఆమె ఇచ్చిన స్పీచ్ కి సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో జాతీయ రాజకీయాల్లో పెద్ద ఇష్యూ గా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: