భర్త అంటే అర్ద భాగం అంటారు.. అలాంటి భార్య తన భర్తకు మధ్య తాగించి మరి చంపేసిన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. మాములుగా పెళ్ళికి ముందుకు పరిచయాలు అక్కడివరకే ఉండాలి.. కానీ పెళ్లి అయినా తర్వాత కూడా కొనసాగిస్తే ఇంకా ఆ బంధం ఎలా ఉంటుంది. చిన్న భిన్నం అవుతుంది. అలాంటిదే ఇప్పుడు ఇక్కడ చోటుచేసుకుంది.. 

 


వివరాల్లోకి వెళితే.. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురా ల్లో చిచ్చు పెడుతన్నాయి. జీవితాలను నాశనం చేయడమే కాదు ప్రాణాల ను కూడా తీస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డగా ఉన్నాడన్న కారణం తో భర్తను చంపిదో భార్య. మద్యం తాగించిన తర్వాత మత్తు లో ఉన్న సమయం లో హత్య చేసింది. సంగారెడ్డి జిల్లా లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య, వెంకటమ్మ దంపతులు సంగారెడ్డి లోని బీరప్ప కాలనీలో నివసిస్తున్నారు.

 


పెళ్ళైన తర్వాత వీరి బంధం కొన్నేళ్ల పాటు వీరి కాపురం సజావుగా నే సాగింది. ఐతే ఇటీవ ల వెంకటమ్మ మరో వ్యక్త తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ సంబంధానికి అడ్డు తగలుతున్నాడని భావించి.. భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. మరో మహిళతో కలిసి ఆ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి భర్తను హతమార్చింది. అతడికి మద్యం తాగించి..అనంతరం అతి దారుణంగా హత్య చేసింది. 

 


అలా భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని అమీన్‌పూర్ లాల్‌భాయ్ కాలనీ వద్ద విసిరేసింది. అక్కడ మృతదేహాన్ని గుర్తించినపోలీసులు కేసు నమోదు చేసుకొని  విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వారికి అంతులేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృత దేహం వద్ద దొరికిన ఆధారాల ప్రకారం విచారణ చేపట్టిన పోలీసులు భార్య హత్య చేసిందని నిర్దారణ చేసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని  విచారణ దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: