ఈ మధ్యకాలంలో  మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.  ముఖ్యంగా అక్రమ సంబంధాల నెపంతో  ప్రాణాలను తీసే వారు ఎక్కువై పోతున్నారు. సాఫీగా సాగిపోతున్న భార్య భర్తల జీవితంలోకి మూడో వ్యక్తి రావడం ఆ తర్వాత ఆ మూడో వ్యక్తి అక్రమ సంబంధానికి తెర లేపడం.. ఇక అక్రమ సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను  కడతేర్చడం..  ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న వాళ్ళు... ప్రియుడి మోజులో పడి కన్న తీపి మరిచి  ఏకంగా సొంత బిడ్డలను కానరాని లోకాలకు పంపిస్తున్న వారు ఈ రోజుల్లో ఎక్కువై పోతున్నారు. దీంతో సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగి పోవడంతో పాటు హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. కనీస మానవత్వం లేకుండా అతి కిరాతకంగా ప్రాణాలు తీస్తున్నారు. 

 

 

 అయితే ఇప్పటికే అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు తెర మీదికి రాగా తాజాగా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకొని... ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన తల్లి కొడుకుని కానరాని లోకాలకు పంపింది . ప్రియుడి మోజులో మునిగి తేలిన ఆ తల్లి... తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో... కుమారుడిని హత్య చేసింది . 8 ఏళ్ళ బాలుడు  వద్దమ్మా  నన్ను  చంపొద్దు అమ్మ అంటూ వేడుకున్న ఆ తల్లి మనసు కరగలేదు. కన్న ప్రేమ కంటే ప్రియుడి ప్రేమే ఎక్కువైపోయింది ఆ తల్లికి. దీంతో తన కొడుకు ప్రాణాలను బలికొంది . నల్గొండ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన విజయ అనే మహిళకు ఒక కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆమె ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ అక్రమ సంబంధానికి 8 ఏళ్ళ కొడుకు నాగరాజు అడ్డు వస్తున్నాడనే కోపంతో.. ప్రియుడితో కలిసి కుమారుడు నాగరాజు గొంతును టవల్ తో బిగించి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టింది . నాగరాజు మృతి అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు చనిపోవడంతో గ్రామస్తులు అనుమానానికి కారణం అయింది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: