ప్రేమ అంటే ఒక మధురానుభూతి.. ప్రేమించడం ప్రేమించబడడం ఒక గొప్ప వరం. కానీ ఈరోజుల్లో  ప్రేమ మాత్రం ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఒకవేల ఒప్పుకోక పోతే ఆత్మహత్యలు చేసుకోవడం లేదా... అమ్మాయిల పై దాడి చేయడం లాంటివి జరుగుతున్నాయి. ప్రేమ ఒప్పుకోకపోతే ప్రియురాలిని చంపడానికి కూడా వెనుకాడలేదు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.. రమాదేవి అనే మహిళపై ఆర్మీ జవాన్  బాలాజీ కాల్పులు జరపడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమ ఒప్పుకోలేదు అనే నెపంతో బాలాజీ కాల్పులు జరిపాడు. 

 

 

 వివరాల్లోకి వెళితే.. రమాదేవి నీ  ప్రేమిస్తున్నానంటూ ఆర్మీ లో పనిచేస్తున్న బాలాజీ గత కొంతకాలంగా వెంటపడుతున్నాడు. అయితే ఇందుకు రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో రమాదేవిపై  కోపం పెంచుకున్నాడు బాలాజీ. ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఉదయం పూట ఎవరూ లేని సమయంలో... రమాదేవి ఇంటికి వచ్చి కాల్పులు జరిపాడు బాలాజీ. నాటు తుపాకితో కాల్పులు జరిపిన బాలాజీ రమాదేవిని చంపేందుకు ప్రయత్నించాడు. అయితే బాలాజీ కాల్పులు జరుపుతున్న ఘటనను  ముందుగానే పసిగట్టిన రమాదేవి తప్పించుకుంది.  

 

 

 అయితే ఈ ఘటనలో రమాదేవి కుడిచేతికి బుల్లెట్ గాయమైంది. కానీ ప్రాణాలతో బయట పడింది. తుపాకీ శబ్దాలు రావడం రమాదేవి గట్టిగా అరవడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు స్థానికులు. దీంతో బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు బాలాజీతో పాటు అతనికి సహకరించిన ఆటోడ్రైవర్ ను  అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు తోసేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఓ జవాన్ అయ్యుండి  కూడా ఒక మహిళ పై కాల్పులు జరపడం  జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: