టిక్ టాక్... మాయదారి  పబ్ జీ  సైతం మరిపించి ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం ఒక ఊపు ఊపేస్తున్న యాప్. ప్రస్తుతం టిక్  టాక్  ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో మంది... ఈ టిక్ టాక్ యూస్  చేస్తున్నారు. కొంతమంది అయితే బానిసలుగా మారిపోయి 24 గంటలు టిక్ టాక్ లోనే సమయాన్ని గడుపుతున్నారు. దీంతో  ఎన్నో అనర్ధాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. ఇక ఎంతో మంది కాపురాల్లో చిచ్చు పెట్టింది ఈ మాయదారి టిక్ టాక్. టిక్టాక్ కారణంగా పలు కాపురాల్లో కలహాలు వస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని వేలూరు లో ఈ ఘటన సంచలనంగా మారింది. టిక్ టాక్ ద్వారా పరిచయమైన వ్యక్తితో ఏర్పడిన పరిచయం అక్రమ సంబంధం వరకూ వెళ్ళింది.

 

 

 వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని వేలూరు కు చెందిన ఓ మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. టిక్ టాక్ లో వీడియోలు చేయడం అలవాటుగా మార్చుకున్నది ఆ మహిళా. టిక్ టాక్ లో కవితలు చెప్పడం డాన్స్ చేయడం పాటలు పాడడం లాంటివి చేసేది. వీడియోలు  వాట్స్అప్ ద్వారా ఇతరులకు పంపేది కూడా. అయితే ఈ మహిళా వీడియోలను  చూసిన ఏలూరు లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రానికి చెందిన వివాహమైన ఓ వ్యక్తి... వీడియోలకు లైకులు కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి...  వీరి పరిచయం స్నేహంగా స్నేహం అక్రమ సంబంధానికి తెరలేపింది. అప్పటి నుంచి ఆమె కుటుంబాన్ని సరిగా పట్టించుకోకపోవడంతో భార్యపై అనుమానం వచ్చిన భర్త సెల్ఫోన్ పరిశీలించగా... అసలు యవ్వారం బయట పడింది. 

 

 

 ఈ క్రమంలోనే భార్యను  మందలించిన ఆమె మాత్రం వినలేదు. ఎంత చెప్పినా భార్య తీరు మారక పోవడంతో వేలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్రమ సంబంధం పెట్టుకున్నా  వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ  వ్యక్తికి  కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. అయితే టిక్ టాక్ మోజులో పడి అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వాలని భర్త నిర్ణయించు కున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: