పోలీస్ అంటే అందరికీ ఆదర్శంగా నిలుస్తారు... నేరాలను అరికట్టి ... ప్రజలకు రక్షణ కల్పించాలి. కానీ ఇక్కడ ఒక పోలీస్ మాత్రం... ప్రజలకు రక్షణ కల్పించడం గురుంచి  దేవుడెరుగు... ఏకంగా పోలీస్ అధికారి ఒక హత్య చేశాడు. అది కూడా ఏదో బయట వారిని అనుకునేరు... సొంత కూతురు ని అతి దారుణంగా చంపేసాడు పోలీస్ అధికారి. క్షణికావేశంలో... కన్న కూతురిని కాటికి పంపించి కటకటాలపాలయ్యాడు. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఉత్తర ప్రదేశ్లోని లక్నో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఉత్తర ప్రదేశ్లోని లక్నో కి చెందిన.. వేద్ ప్రకాశ్ సింగ్ అనే వ్యక్తి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. 

 

 

 అయితే ఈయన చదువుల విషయంపై తన కూతురుతో శుక్రవారం గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వేద్ ప్రకాష్ సింగ్... తన కూతురిని తీవ్రంగా కొట్టాడు. ఆ వెంటనే గాయపడిన కూతురును స్వయంగా ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు ఆ వ్యక్తి. ఇక ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు. ఇక ఆవేశంలో పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ ని తీసుకొని కూతురునీ చితకబాదాడు. దెబ్బలు బలంగా తగలడంతో... ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. 

 

 

 స్పృహ కోల్పోయిన కూతురుని ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు ప్రకాష్. అయితే తన కూతురు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు... ఆస్పత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. అనంతరం ప్రకాష్ కుటుంబ సభ్యులు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడానికి గమనించారు పోలీసులు. కూతురు తుపాకీతో కాల్చుకుని చనిపోయింది అంటూ పోలీసులకు అబద్ధం చెప్పసాగారు. అయితే మొదట ప్రకాష్ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని నమ్మిన పోలీసులు పోస్టుమార్టం రిపోర్టులు అసలు నిజం బయట పడడంతో... ప్రకాష్ నేరం చేశాడని నిర్ధారించారు. ప్రకాష్ కూడా నేరం ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: