భార్యా భర్తలు అన్న తర్వాత ఎన్నో కలతలు ఉంటాయి.  అవి పెద్దలు సర్థిచెప్పి వారిని కాపురం సజావుగా కొనసాగేలా చేస్తుంటారు.  కొన్ని సార్లు ఇవి పట్టు బిగించే వరకు వెళ్లడం.. చివరికి విడాకులతో ముగింపు పలుకుతుంటారు.  అయితే భార్య పుట్టింటికి వెల్లడంతో భర్త కోపం తెచ్చుకున్నాడు.  అంతే కాదు తన భార్యకు మాయ మాటలు చెప్పి కాపురానికి పంపడం లేదని ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది.  వివరాల్లోకి వెళితే.. వేముల శ్రీదేవి, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజరాజు భార్యాభర్తలు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరగ్గా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు పొడసూపడంతో శ్రీదేవి ఈ నెల 18న పుట్టింటికి వచ్చేసింది.

 

భార్యకు నచ్చజెప్పి తీసుకెళ్లేందుకు గురువారం సుజైరాజు నేరేడుచర్ల వచ్చి వెళ్లాడు. శుక్రవారం మరోమారు వచ్చిన నిందితుడు భార్యను తనతో పంపాలని కోరాడు.  తమ బిడ్డకు రక్షణ లేదని.. అన్ని తేలిన తర్వాత కాపురానికి పంపుతామని వారు చెప్పారు.  దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుజైరాజు తన చిన్న కుమార్తెను కారులో ఎక్కించాడు.  అయితే దేవి మేనమామ గుంజ శంకర్ అడ్డుపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సుజయ్.. శంకర్‌ను కారుతో ఢీ కొట్టాడు. దీంతో అతడు ఎగిరి కారు బానెట్ మీద పడిపోయాడు. కారు ఆపాలని ఎంతగా రోదించినా... మద్యం మత్తులో ఉన్న సుజయ్ వినలేదు.

 

అలాగే కారుపై ఉన్న ఆమె మేన మామను అలాగే ఓ కిలోమీటర్ వరకు లాక్కేల్లాడు.   బ్రేక్ కొట్టడంతో శంకర్ కిందపడిపోయాడు. అప్పటికే ఆమె మేనమామ రక్తపు మడుడులో పడిపోయారు. ఈ మొత్తం ఘటనను చూసిన స్థానికులు... సుజయ్‌ను ఆపే ప్రయత్నం చేశారు. అయితే అతడు మద్యం మత్తులో ఉండటంతో ఎవరూ వారించలేకపోయారు. బాధితుడు శంకర్‌ను ఆస్పత్రికి తరలించేందుకు 108 వాహనం వచ్చింది.  మార్గ మద్యలోనే అతడు ప్రాణాలు వదిలాడు.  సమాచారం అందుకున్న పోలీసులు సైతం అడ్డుకోబోగా దొరక్కుండా కూతురితో సహా సుజయ్ పరారయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: