నిజాంబాద్ లో జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. అధికార పార్టీ నేత దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని దుండగులు టిఆర్ఎస్ నేతను  అతి దారుణంగా గొడ్డలితో నరికేశారు. ఉదయం ఫోటో ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే తీవ్ర గాయాలపాలై తీవ్ర రక్తస్రావమై కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. ఇక గుడికి వెళ్ళి తిరిగివచ్చిన కూతురు తండ్రి మరణవార్త విని బోరున విలపించింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణం అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

 వివరాల్లోకి వెళితే... నిజాంబాద్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ నేత రమణ రెడ్డి హత్య ప్రస్తుతం కలకలం రేపుతోంది.. ఉదయం గుర్తుతెలియని దుండగులు టీఆర్ఎస్ నేత రమణారెడ్డి ని గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపేశారు. రమణారెడ్డి ఇంటి గేటు లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు.. ఇంట్లో ఫోన్ మాట్లాడుతున్న రమణారెడ్డి మెడ తల పై గొడ్డలితో విచక్షణారహితంగా నరికారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఇక రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమణారెడ్డి ని  గుడికి వెళ్లి తిరిగి వచ్చిన కూతురు చూసి  షాక్ అయింది. షాక్ నుంచి తేరుకున్న కూతురు బోరున విలపించింది. దీంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. 

 

 

 దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమణారెడ్డి ని పోలీసు వాహనంలో ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం అయిన రమణారెడ్డి చికిత్స పొందుతూ మరణించాడు. అయితే రమణ రెడ్డి హత్య వెనుక భార్య  హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో భార్య భర్తల మధ్య గొడవలు జరిగే ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ వేరు వేరుగా ఉంటున్నారు. అంతేకాకుండా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. ఆస్తి పంపకం విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన ఈ వివాదం మరింత ముదిరిపోయి... రమణా రెడ్డి హత్యకు కారణం అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: