డ్రగ్.. ఒక మనిషిని మృగాన్ని చేస్తుంది. ఒకసారి డ్రగ్  తీసుకున్న వ్యక్తి ఒక మనిషిని చంపడానికి కైనా వెనుకాడడు చావడానికైనా వెనుకాడడు. ఎందుకంటే ఆ వ్యక్తి తీసుకున్న డ్రగ్  ఆ వ్యక్తిని అంతగా ప్రభావితం చేస్తుంది.. ఒక మామూలు మనిషి ప్రభావంతో... అత్యంత శక్తివంతులుగా మార్చి ఆ తర్వాత క్రమ క్రమంగా క్షీణించి మరణించేలా చేస్తుంది డ్రగ్. ఇకపోతే ఈ రోజుల్లో డ్రగ్స్ వాడకం పెరిగిపోతూనే ఉంది. ముఖ్యంగా యూత్ ఎక్కువగా డ్రగ్  బారిన పడుతున్నారు. డ్రగ్  తీసుకోవడం ద్వారా.... ప్రతి తీసుకునే సమయంలో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత క్రమక్రమంగా మనిషి ఆయుష్షు తగ్గిపోతుంటుంది అన్న విషయం తెలిసిందే. ఒకసారి డ్రగ్  తీసుకుందామంటే మరోసారి తీసుకోవాలి అనిపిస్తుంది... ఇక  మరోసారి తీసుకుంటే అదే అలవాటుగా మారిపోతుంది. 

 

 

డ్రగ్ లేకుండా క్షణమైనా జీవించలేనీ  పరిస్థితి వస్తుంది. ఇప్పటికే డ్రగ్స్ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి యువత డ్రగ్  వాడకంపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డ్రగ్  కూడా వివిధ రకాలుగా ఉండడంతో... ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వాడుతున్నారు. అయితే డ్రగ్ వాడుతున్న వారికి... డ్రగ్ తీసుకోకపోతే ఊపిరి ఆగిపోయినంత పని అయిపోతుంది. అయితే ఇక్కడ ఓ దారుణ ఘటన జరిగింది. డ్రగ్ ఒక మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు. 

 

 

 జాంబీ డ్రగ్ ఈ యువకుడు జీవితాన్ని చిత్తు చేసింది. జాంబి డ్రగ్  తో మితిమీరిన మత్తులోకి వెళ్లిన ఓ యువకుడు తన కాళ్లు తానే  నరుక్కునేలా ప్రభావితం చేసింది ఈ డ్రగ్. రష్యాలోని ప్రోకోఫైవిసాక్  పట్టణంలో ఈ ఘటన జరిగింది. ప్రోకోఫైవిసాక్ చెందిన 29 ఏళ్ల యువకుడు... జాంబి డ్రగ్ వాడుతుండేవాడు. రోజురోజుకు పూర్తిగా మత్తులో పడి పోయాడు. ఒకరోజు మరింత డోస్  ఎక్కువ తీసుకున్నాడు... దీంతో తన ఎడమ కాలును నరికేసి శరీరం నుంచి వేరు చేసుకున్నాడు ఆ యువకుడు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆలస్యం కావడంతో వైద్యులు అతని కాలును అతికించలేక  లేకపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతని ఐసీయూ లో  చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: