మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆగడం లేదు. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో ఏదో ఓ చోట మహిళలపై అత్యాచారం, హత్యలు కొనసాగుతున్నాయి. దిల్లీ నుంచి చిన్న గ్రామాల్లోనూ రోజూ ఏదో ఓ చోట ఈ దారుణ ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఓ మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా దారుణంగా ఆమెను చంపిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

 

విల్లుపురం రైల్వే క్వార్టర్స్‌లో ఓ మహిళ(35) దారుణహత్యకు గురైంది. రక్తపు మడుగులో పడిన ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెను దారుణంగా రేప్ చేసి రాళ్లతో కొట్టి చంపేశారని తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆ మహిళను ముందు రోజు రాత్రి ఓ బాలుడితో చూశామని కొందరు చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

 

విల్లుపురం రైల్వే క్వార్టర్స్‌లో ఉండే మహిళ భర్తను వదిలేసి ఒంటరిగా జీవిస్తోంది. ఆమెతో కొంతకాలంగా 17ఏళ్ల బాలుడు అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 14వ తేదీన వారిద్దరూ కాలనీలోని ఓ పాడుబడిన ఇంట్లో ఏకాంతంగా గడిపారు. శారీరక సుఖం అనుభవించిన తర్వాత బాలుడిని ఆమె డబ్బులు అడిగింది. ఇంకా కావాలని ఆమె డిమాండ్ చేయగా తన వద్ద లేవని చెప్పాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే అక్రమ సంబంధం విషయం మీ తల్లిదండ్రులకు చెబుతానని ఆమె బెదిరించింది.

 

కోపోద్రిక్తుడైన బాలుడు ఆమె చేతి నరాలు కట్ చేసి బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. రక్తపు మడుగులో ఆమె కొట్టుమిట్టాడుతుండగానే మరోసారి శారీకరంగా అనుభవించి అక్కడి నుంచి పరారయ్యాడు. బాలుడు చెప్పిన వివరాలన్నింటినీ ఛార్జిషీటులో దాఖలు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు మైనర్ కావడంతో అక్కడి నుంచి జువైనల్ హోమ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: