బెంగుళూరులో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చాలా చాకచక్యంగా  చేధించారు. ఓయో సర్వీస్ అపార్ట్‌మెంట్లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గురువారం రాత్రి మాటువేసి మరీ రైడ్ చేశారు. ఓ ఫ్లాట్‌లో ఇద్దరు సెక్స్‌వర్కర్లతో పాటు సందీప్, సుజయ్ అనే నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను పనరావాస కేంద్రానికి, నిర్వాహకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం. 

 

ఓయో సంస్థ అనుబంధంగా కొనసాగుతున్న కింగ్స్ సూట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్లో కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులుకు సమాచారం అందింది. క్రైమ్ బ్యాంచ్ డిప్యూటీ కమిషనర్ కుల్దీప్ జైన్ ఆదేశాల మేరకు పోలీసులు అక్కడ రైడ్ నిర్వహించారు. పోలీసులను గమనించిన ఇద్దరు సెక్స్‌వర్కర్లు పారిపోగా మిగిలిన ఇద్దరిని పట్టుకున్నారు. నిర్వాహకుల్లో సుదీప్ కర్ణాటకు చెందినవాడు కాగా.. సంజయ్ ఢిల్లీకి చెందిన వాడు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

 

ఓయో హోటల్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. తాజాగా సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తుండటాన్ని పోలీసులు చేధించి నిర్వాహకులను నోటీసులు జారీచేశారు. హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా, సదరు యాజమాన్యం మాత్రం పెడచెవిని పెడుతున్నారు. ఆ మధ్య లైవ్ బ్యాండ్ అమ్మాయిలు-హైటెక్ వ్యభిచారం విషయం కల కలం సృష్టించిన విషయం తెలిసినదే.

 

వివరాల్లోకెళితే.. లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పిలుచుకుని వచ్చిన అందమైన అమ్మాయిలతో మించు (రెచ్చిపో) అనే పేరుతో లైవ్ బ్యాండ్ నిర్వహిస్తున్నారని, హైటెక్ వేశ్యవాటిక నిర్వహకులను అరెస్టు చేశామని.. సీసీబీ పోలీసులు తెలిపారు. తాజాగా జరిగిన సంఘటనలతో  కర్ణాటక రాజధాని అట్టుడుకుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: