వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు భయం పట్టుకుందని అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అని బాబు భయపడుతున్నాడని చెప్పారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆళ్ల టీడీపీ ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడుపై ఘాటు విమర్శలు చేశారు. 
 
చంద్రబాబు అండ్ కో వైసీపీ ప్రభుత్వం సిట్ వేయడంతో భయపడుతోందని అన్నారు. చంద్రబాబు వ్యవస్థలను మ్యానేజ్ చేసి ప్రభుత్వాన్ని, రైతులను తప్పుదారి పట్టించారని వ్యాఖ్యలు చేశారు. పోలీస్, రెవెన్యూ వ్యవస్థలను రాజధానిలో అడ్డుకోవడం సరికాదని అన్నారు. ప్రభుత్వం రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని అన్నారు. రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు ట్రాప్ లో మాత్రం పడొద్దని ఆళ్ల సూచించారు. 
 
వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల టీడీపీ పాలనపై సిట్ ఏర్పాటు చేయడంపై టీడీపీ మండిపడుతోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీల మధ్య ఇప్పటికే సిట్ చిచ్చు రాజుకుంది. వైసీపీ సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ నాయకులు మాత్రం నిజాలు నిగ్గు తేల్చడం కొరకే సిట్ ను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు.                   
 
టీడీపీ నాయకులు మాత్రం ప్రతిపక్ష పార్టీ నాయకులను ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందువలనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా ఐదేళ్ల పాలనపై సిట్ వేయడం లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడంతో టీడీపీ అక్రమాలు, అవినీతి వెలుగులోకి వస్తాయనే వైసీపీ భావిస్తోంది. చంద్రబాబు వైసీపీ టీడీపీని, ఏపీని టార్గెట్ చేసిందని వ్యాఖ్యలు చేయడంతో ఆళ్ల ఆ వ్యాఖ్యల గురించి స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: