ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలు కు విలువ  లేకుండా పోయింది ... చిన్న చిన్న విషయాలకి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు సాటి మనుషులు . చిన్న  గొడవలు ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్తున్నాయి. అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్య... లేదా క్షణికావేశంలో చేసే హత్యలు  రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న వివాదానికే క్షణికావేశంలో ప్రాణాలు తీస్తూ చివరికి కటకటాలపాలవుతున్నారు చాలా మంది. ఈ రోజుల్లో ఇలాంటి ఘటనలు  ఎన్నో తెర మీదికి వస్తున్నాయి ... తల్లి కొడుకు ని చంపడం... కొడుకు తల్లిదండ్రులను చంపటం... లేదా తండ్రి కొడుకు కు చంపటం ... ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంటున్నది ఈరోజుల్లో . రక్తసంబంధం ని మరిచి  దారుణంగా సొంత వాళ్లని కడతేరుస్తున్నారు  ఈ రోజుల్లో.

 

 

 ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరగ్గా ... తాజాగా ఇలాంటి ఘటన మరొకటి తెరమీదికి వచ్చింది. వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా బొద్దిడి లో  దారుణ హత్య జరిగింది. కోడి  కోసం జరిగిన ఒక చిన్న వివాదం ప్రాణాలు తీసింది. జిల్లాలోని గుమ్మా లక్ష్మీపురం మండలంలో నీ బొద్దిడి  గ్రామంలో... మదేశ్వరరావు అనే యువకుడు తన పెరట్లో ఓ కోడిని  పెంచుకుంటున్నాడు.అహితే  అతడి తండ్రి కాంతారావు సమీపంలోని చెరువు లోకి తీసుకువెళ్లి  ఆ కోడిని నీళ్లలో ముంచగా  ఆ కోడి మృతి చెందింది. ఇక సాయంత్రానికి ఇంటికి వచ్చిన కొడుకు కోడి ఏదని ఆరాతీయగా చనిపోయిందనీ  తండ్రి  బదులిచ్చాడు, ఈ నేపథ్యంలోనే కోడి కోసం తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది. మాటా మాటా పెరగడంతో కోపోద్రిక్తుడైనా తండ్రి కాంతారావు కత్తితో కొడుకు ఛాతి  పై దాడి చేశాడు.

 

 

 దీంతో మదేశ్వరరావు  అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మథేశ్వర రావు కుప్పకూలి పోవడం తో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు... అతని హుటాహుటిన బద్రిగిరీలోని  ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలాడు మదేశ్వర రావు .ఇక  కొడుకు చనిపోయాడు అని తెలిసిన తండ్రి కాంతారావు ఇంటి దగ్గర నుంచి పరారయ్యాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు. ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: