అబ్బబ్బా.. పచ్చ పార్టీ నేతల నోర్లు మూయించాలి అంటే కేవలం ఒక్క విజయసాయి రెడ్డికి చేతనవుతుంది.. ఎందుకు అని మీకు సందేహం రావచ్చు... విజయసాయి రెడ్డి ఒక్క మాట మాట్లాడాడు అంటే కొన్ని గంటల సమయం తీసుకొని మాట్లాడుతారు ఆ నేతలు.. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంతగట్టిగా కొడుతారు దెబ్బ..  

 

ఇకపోతే.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు అయినా విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తే వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంటాడు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటివరకు దమ్ము గురించి మాట్లాడిన నేతల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. దమ్ముంటే దర్యాప్తు జరిపించుకోండి. అధికారంలో ఉన్నారు కదా అని నిన్న మొన్నటి వరకు సవాళ్లు విసిరిన వారంతా కుక్కిన పేనులయ్యారు. ఏ తప్పూ చేయలేదనుకుంటే సిట్ ముందుకు వచ్చి మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. పునీతులని తేలితే మిమ్మల్నెవరూ పల్లెత్తు మాట అనరు.'' అంటూ వ్యాఖ్యలు చేశారు. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు పచ్చ నేతలపై ఓ రేంజ్ లో డైలాగులు వేస్తున్నారు.. ''పప్పు నాయుడు పచ్చళ్ళ నాయుడు నోరు తెరవకుండా ఇక్కడ కామెంట్లు పెట్టడానికి  పచ్చకుక్కలను ఎగదోస్తున్నారు. ఇక్కడ కామెంట్లు పెట్టె పచ్చకుక్కలు చాలావరకు ఆత్మఘోషభవన్ టెంపరరీ ఉద్యోగులే.'' అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. దీంతో ఈ ట్విట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: