వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై వేసిన.. సారీ సారీ.. పడిన సెటైరికల్ పాటను చూస్తే ఎవరైనా సరే కడుపు పగిలేలా నవ్వుతారు.. ఏంటి విజయసాయి రెడ్డి పాట పాడరా? అని మీకు సందేహం రావచ్చు.. కానీ నిజం.. విజయసాయి రెడ్డి నిజంగానే ట్విట్టర్ వేధికగా రంగస్థలం పాటను చంద్రన్నపై పాడారు. 

 

అయితే అదే పాటను పాడారు అని కాదు కానీ చంద్రబాబు ఏ జైలుకెళ్తావు అంటూ తనదైన ట్విట్ ను పాట రూపంలో చెప్పి ఈరోజు అంత ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యారు విజయసాయి రెడ్డి.. ట్రెండ్ అయ్యేంత ట్విట్ ఎం పెట్టారు? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న..  

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ.. ''ఆజైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల... అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో?'' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో ఈ ట్విట్ చుసిన నెటిజన్లు.. ఒకటే నవ్వులు.. పాపం ఎందుకండీ చంద్రబాబుతో అలా ఆడుకుంటారు అంటూ ట్విట్లు చేశారు కొందరు. మరికొందరు ట్విట్ చేస్తూ '' ఈరోజు వాతావరణ విశేషాలు.. బాబోరుకి ఎండాకాలం సెలవలు..జీవితాంతం ఉండే అవకాశం ఉందని..రాజకీయ వాతావరణ కేంద్రం ఇప్పుడే ఓ ప్రకటనలో వెళ్ళడించింది'' అంటూ ట్విట్స్ చేశారు. దీంతో ఈ ట్విట్లు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: